విభజన బాధించింది: బ్రహ్మ, భార్యాభర్తలు కారని..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం తనను బాధించిందని ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన హెచ్ఎస్ బ్రహ్మ శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ మేరకు స్పందించారు.
కొద్ది రోజుల్లోనే తన ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోనుందని చెప్పిన ఆయన, ఎంతో శ్రమకోర్చి తాము నిర్చించుకున్న అందమైన రాష్ట్రం విభజనకు గురవుతండటం తనకు బాధగా ఉందని బ్రహ్మ తెలిపారు.
ఎవరైనా దంపతులకు ఒక్కసారిగా మీరు భార్యాభర్తలు కారని చెబితే ఎలా ఉంటుందో ప్రస్తుత పరిస్థితి కాడా అలాగే ఉందని హెచ్ఎస్ బ్రహ్మ అభిప్రాయపడ్డారు.

ఇది ఇలా ఉండగా ఇతర విషయాలపై మాట్లాడిన ఆయన, భారతీయ జనతా పార్టీ నేత అమిత్ షా ప్రసంగంలో ప్రత్యేకంగా తప్పుపట్టాల్సిందేమి లేదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. అజంగఢ్ను ఉగ్రవాదుల స్థావరమన్నారని ఆరోపణలు రావడంతో ఈసి ఆయన ప్రసంగాన్ని పరిశీలించింది. అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన వీడియోలను తాము చూశామని, ఆయన ‘అజంగఢ్' అని మాత్రమే అన్నారని బ్రహ్మ తెలిపారు.
ఆ విషయంలో అంతకుమించి ఆయనేమీ మాట్లాడలేదని చెప్పారు. ఆయన గత వ్యాఖ్యలపై పశ్చాత్తాం వ్యక్తం చేసిన తర్వాతే మళ్లీ ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతించినట్లు బ్రహ్మ చెప్పారు. ఇది ఇలా ఉండగా కార్గిల్ యుద్ధంలో ముస్లిం సైనికుల వల్లే విజయం సాధించామన్న అజంఖాన్ వ్యాఖ్యలు అతను సమర్థించుకున్నందువల్లే అతనిపై వేటు వేశామని ఈసి తెలిపింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications