మావోలకు కోలుకోలేని దెబ్బ: గడ్చిరౌలి ఎన్కౌంటర్లో 26 మంది మావోలు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలీలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోలు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీ సంఖ్యలో నక్సల్స్ మరణించారు. 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయని వెల్లడించారు. ఈ మేరకు వివరాలను గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధృవీకరించారు. ధనీరా తాలూకా గ్యారబట్టి అడవి ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. కాగా, మృతి చెందిన మావోయిస్టుల సంఖ్యే పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు శనివారం ఉదయం నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు.
కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మావోయిస్టు నేత మిలింద్ తెల్ తుంబ్డే కూడా ఈ ఎదురుకాల్పుల్లో మరణించినట్లు సమాచారం. ఎల్గార్ పరిషత్-భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో పుణె పోలీసులు.. తెల్ తుంబ్డేను వాంటెడ్ లిస్టులో చేర్చారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications