కర్ణాటకను చీల్చండి: ప్రభుత్వాన్ని కూల్చేస్తాం
బెంగళూరు: ఉత్తర కర్ణాటకను విభజించకుంటే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ శాసన సభ్యుడు ఉమేష్ కత్తి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన 25 మంది శాసన సభ్యులు రాజీనామ చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని ఉమేష్ కత్తి అంటున్నారు.
శుక్రవారం ఆయన బెల్గాంలో విలేకరులతో మట్లాడారు. బెంగళూరు అన్ని విధాల అభివృద్ది కావాలంటే మూడుగా విభజించాలని చెబుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను ఎందుకు రెండుగా విభజించరు అని సూటిగా ప్రశ్నించారు. ఉత్తర కర్ణాటకలోని అన్ని జిల్లాలు వెనుకపడ్డాయని విచారం వ్యక్తం చేశారు.
కర్ణాటక అభివృద్ది కావాలంటే కచ్చతింగా విభజించాలని డిమాండ్ చేశారు. మీ సోంత పార్టీలోని ఎంఎల్ఏలు ఉత్తర కర్ణాటకను విభజించాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. మీరు సరైన నిర్ణయం తీసుకొకపోతే కాంగ్రెస్ లోని 25 మంది శాసన సభ్యులు వారి పదవులకు రాజీనామా చేస్తారని హెచ్చరించారు.
, అప్పుడు మీ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నాయకుడు ఉమేష్ కత్తి హెచ్చరించారు. వెంటనే శాసన సభ సమావేశాలు ఎర్పాటు చేసి కర్ణాటకను విభజించే విషయంపై చర్చించాలని ఉమేష్ కత్తి డిమాండ్ చేశారు.
మాకు సంబంధం లేదు..............!
ఉమేష్ కత్తి మాట్లాడిన మాటలకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. శుక్రవారం బెంగళూరులో బీజేపీ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి, విదాన పరిషత్ లో ప్రతిపక్ష నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం కే.ఎస్. ఈశ్వరప్ప, మాజీ మంత్రి రవి మాట్లాడారు. ఉమష్ కత్తి వ్యతిగతంగా మాట్లాడారని, పార్టీకి సంబంధం లేదని చెప్పారు. ఈ విదంగా మాట్లాడటంతో భాదకలిగించిందని చెప్పారు.