మోడీపై ఆత్మాహుతి దాడి జరగొచ్చు: ఐబి వార్నింగ్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై బీహార్ పర్యటనలో మానవబాంబుతో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. పాట్నాలో శనివారం ప్రధాని పర్యటించనున్నారు. ముజఫర్పూర్లో శనివారం ప్రధాని మోడీ బహిరంగసభలో ప్రసంగిస్తారు.
1991లో మాజీ ప్రధాని రాజీవ్గాంధీపై ఎలాగైతే మానవబాంబు దాడి జరిగిందో అదే తరహాలో మోడీపై జరిగే అవకాశముందని ఐబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో బీహార్ ప్రభుత్వాన్ని, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు దళాలను అధికారులు అప్రమత్తం చేశారు.

మీడియాకు చెందిన వ్యక్తిగా కానీ, పోలీస్ అధికారిగా కానీ, ఎలక్ట్రిషియన్, కేటరర్, లేదా, కార్మికుడి రూపంలో మానవబాంబు ఆత్మాహుతి దాడి జరిగే అవకాశముందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
బీహార్లో ప్రధాని శనివారం బిజెపి తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా, 2013, అక్టోబర్27న పాట్నా గాంధీ మైదాన్లో జరిగిన మోడీ బహిరంగసభలో పేలుళ్లు జరిగి ఐదుగురు చనిపోయారు. సుమారు వందమంది గాయపడ్డారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications