కర్ణాటక ప్రజలు నన్ను క్షమించాలి... నాకు సీఎం పదవి అవసరం లేదు... సభలో కుమారస్వామి
కర్ణాటక అసెంబ్లీలో మరి కాసెపట్లో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న సీఎం కుమార స్వామీ సభలో ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. తన వల్ల ఎమైన తప్పులు జరిగి ఉంటే ప్రజలు క్షమించాలని సభ ముఖంగా కోరారు. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి రోజు నుండే ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేశానని సభలో ప్రకటించారు.తాను ఎప్పుడు పదవుల కోసం వెంపర్లాడలేదని అన్నారు.
పెళ్లి సమయంలో తనను తప్ప తన రాజకీయా జీవితాన్ని గాని, అధికారాన్ని గాని చూసి పెళ్లి చేసుకోలేదని చెప్పిందని అన్నారు. ఈనేపథ్యంలోనే ఆమే ఇప్పుడు సభలో కూడ ఉందని చెప్పారు. మరోవైపు కోద్ది క్షణాల్లో ప్రభుత్వం భవితవ్యం తేలనున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి తన అవేదనను సభలో వెళ్లగక్కారు. సీఎంగా పదవిని చేపట్టిన అనంతరం ఒక్క క్షణం కూడ పదవిని వృధా చేయలేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే విశ్వాస పరీక్షకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. అయితే డివిజన్ పద్దతిలో ఓటింగ్ జరగాలని ఆయన స్పికర్ను కోరారు.అయితే తాజ పరిణామాలు తనను మానసిక క్షోభకు గురి చేశాయని చెప్పారు. మరోవైపు రైతులకు ఇచ్చిన హామిని తాను నిలబెట్టుకున్నానని చెప్పారు.

ఈనేపథ్యంలోనే తాను సీఎం గా పదవి నుండి తప్పుకునేందుకు సిద్దంగా ఉన్నానని కూడ మరోసారి సభలో ప్రకటించారు. స్వయంగా సోనియా గాంధీ తనను సీఎం పదవి చేపట్టాలని కోరిందని అందుకే తాను సీఎం కుర్చిలో కూర్చున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications