‘ఎవరికీ ద్రోహం చేయలేను... అందుకే ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నా’
చత్తీస్గఢ్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే బస్తర్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
టికారా లొహంగ గ్రామానికి చెందిన చందూ మౌర్య గత ఆదివారం ఒకే మండపంలో ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు.
ఈ పెళ్లి తంతు, వివిధ కార్యక్రమాలు నాలుగు రోజులపాటు జరిగాయి. చందూది మురియా తెగ.
''నేను ఈ ఇద్దరు అమ్మాయిలనూ ప్రేమించా. ఎవరికీ ద్రోహం చేయలేను. మనసులో కొంత అనుమానం ఉండేది. అయితే, ఈ ఇద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. నేను కూడా ఒప్పుకున్నా’’ అని చందూ చెప్పారు.
చందూ భార్యల పేర్లు సుందరి కశ్యప్, హసీనా బఘేల్. ఈ పెళ్లి విషయమై వారిద్దరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
''నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఆయనతోనే ఉండాలనుకున్నా. ఆమె కూడా అదే కోరుకుంది. నాకే సమస్యా లేదు. పెళ్లి విషయం వచ్చేటప్పటికి, ఇద్దరం చందూనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అని సుందరి చెప్పారు.
చందూ మౌర్య తొమ్మిదో తరగతి వరకూ చదువుకుని, ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు.
చందూ కుటుంబానికి మొత్తంగా రెండెకరాల భూమి ఉంది. దీన్ని సాగు చేయడంతోపాటు అటవీ ఉత్పత్తులు సేకరిస్తూ వారు ఆదాయం సంపాదించుకుంటున్నారు.
మూడేళ్ల క్రితం పని మీద తోకాపాల్లోని ఎరండ్వాల్ గ్రామానికి వెళ్లానని, అక్కడే సుందరిని కలిశానని చందూ చెప్పారు.
సుందరి పదో తరగతి వరకూ చదువుకున్నారు.
మొదటిసారి చూసినప్పుడే, ఆమెకు తాను ప్రేమిస్తున్న విషయం చెప్పానని చందూ అన్నారు. ఆ తర్వాత ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటూ, ప్రేమించుకున్నామని వివరించారు.
- వేలిముద్రలు లేని కుటుంబం: 'నాకే కాదు, మా మాత ముత్తాతలకూ లేవు'
- 'సోలో బతుకే సో బెటర్’ అని జపాన్ ప్రజలు ఎందుకు అంటున్నారు?
ఆ తర్వాత హసీనాతో...
ఆ తర్వాత రెండేళ్లకు ఓ పెళ్లి చూసేందుకు తమ గ్రామానికి వచ్చిన హసీనాను చందూ కలిశారు.
హసీనాది కరంజీ అనే గ్రామం. ఆమె తొమ్మిదో తరగతి వరకూ చదువుకున్నారు.
''హసీనా ఓ పెళ్లికి వచ్చింది. అక్కడే కలిశా. తను మాట్లాడుకుందాం అంది. సరే అన్నా. స్నేహితులమవుతాం అనుకున్నా. కానీ, విషయం ఇంకా ముందుకు వెళ్లింది’’ అని చందూ చెప్పారు.
''ఓ రోజు హసీనా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. సుందరి గురించి ఆమెకు చెప్పా. 'నీతో ఉండటానికి ఎవరు ముందు వస్తే, వారితో ఉండు’ అని హసీనా అంది. ఈ విషయం సుందరి ముందు దాచాలనుకోలేదు. ఆమెకు చెప్పాను. ఆ తర్వాత ముగ్గురం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాం’’ అని వివరించారు.
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
సహజీవనం
కొన్ని రోజుల తర్వాత హసీనా తమ ఊరు విడిచిపెట్టి, చందూతో కలిసి ఉండేందుకు వచ్చేశారు.
ఛత్తీస్గఢ్లో చాలా తెగల్లో కొన్ని చిన్న సంప్రదాయ కార్యక్రమాలు చేసుకుని, పెళ్లి చేసుకోకుండానే యువతీయువకులు కలిసి ఉంటుంటారు.
అయితే, చందూ దగ్గరికి హసీనా వచ్చేసిన విషయం తెలుసుకుని సుందరి కూడా చందూ దగ్గరికి వచ్చేశారు. ముగ్గురూ కలిసి ఉండటం మొదలుపెట్టారు.
కానీ, సుందరిని ఆమె కుటుంబ సభ్యులు వచ్చి, మళ్లీ తమ ఇంటికి తీసుకువెళ్లారు.
''మేం ముగ్గురం కలిసి దాదాపు ఒక సంవత్సరం ఉన్నాం. మా తెగ వాళ్లు పెళ్లి చేసుకోమని అన్నారు’’ అని చందూ చెప్పారు.
చందూని పెళ్లి చేసుకుని ఆయనతోపాటు కలిసి ఉండేందుకు సుందరి, హసీనా ఇద్దరూ సిద్ధమయ్యారు.
దీంతో ముగ్గురి పేర్లతో పెళ్లి కార్డులు కొట్టించి, ఊరిలో వేడుకకు చందూ కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లూ చేశారు.
ఈ పెళ్లికి హసీనా బంధువులు వచ్చారు గానీ, సుందరి బంధువులు రాలేదు.
''ఈ పెళ్లితో నేను సంతోషంగా ఉన్నా. హసీనా, నేను ఏ విషయంలోనూ తగువులాడుకోం’’ అని సుందరి చెప్పారు.
సుందరి, హసీనా కలిసి మార్కెట్కు వెళ్తుంటారు. తమకు ఇష్టమైన దుస్తులు కొనుక్కుంటుంటారు.
భార్యలకు ఏదైనా కానుకగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఇద్దరికీ ఒకే రకమైనవి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని చందూ అన్నారు.
రాబోయే రోజుల్లో తమ మధ్య ఏ సమస్యా రాదని ఈ ముగ్గురూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్కు సిద్ధంగా ఉంటాయా?
- 'లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారిపోయాను, నా కథ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే...'
చట్టం ఏం చెబుతోంది?
''ఆ ముగ్గురూ మురియా తెగకు చెందనివారే. ఈ తెగలో బహుభార్యత్వం తప్పు కాదు. మా సంఘానికి ఈ పెళ్లి విషయంలో అభ్యంతరాలు లేవు’’ అని సర్వ్ ఆదివాసీ సమాజ్ నాయకుడు ప్రకాశ్ ఠాకుర్ అన్నారు.
ఇక హిందూ వివాహ చట్టంలో బహుభార్యాత్వాన్ని నేరంగా పరిగణించే నియమాలు గిరిజన తెగలకు వర్తించవని... వారి వారి ఆచారాలు, విశ్వాసాలను పాటించుకునేలా సెక్షన్ 2(2) ద్వారా ఈ మినహాయింపు ఇచ్చారని హైకోర్టు న్యాయవాది ప్రియాంక శుక్లా చెప్పారు.
ఇదివరకు ఇదే విషయం స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు తీర్పును కూడా ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి:
- 'అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- మాంసం 'హలాల్’: ఒక మతం నిబంధనలను ఇతర మతాలపై రుద్దుతున్నారా?
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- కృష్ణా బోర్డును విశాఖలో ఏర్పాటుచేయాలని ఏపీ ప్రభుత్వం ఎందుకు అనుకుంటోంది
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)