నీరా రాడియా మా ఇంటికి వస్తుండేది: రాజా
న్యూఢిల్లీ: కార్పోరేట్ లాబీయిస్టు నీరా రాడియాను తాను కలుసుకున్నట్లు 2జి స్పెక్ట్రమ్ కేసు నిందితుడు, మాజీ టెలికం మంత్రి ఏ. రాజా అంగీకరించారు పనికి సంబంధించి ఆమెతో పాటు టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటాను కూడా కలుసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, తాను ఫోన్లో సంభాషణ జరపలేదని చెప్పారు.
టాటా గ్రూప్ పనులు గురించి నీరా రాడియా తమ ఇంటికి వస్తుండేదని ఆయన అన్నారు. సిబిఐ కోర్టులో సాక్షిగా తన వాంగ్మూలాన్ని ఆయన చెప్పారు. మంత్రివర్గం కూర్పు గురించి తాను రాజాతో టెలిఫోన్లో మాట్లాడినట్లు, టాటా గ్రూప్ తరఫున 2008లో తాను రాజాను కార్యాలయంలో కలిశానని నీరా రాడియా ప్రాసిక్యూషన్ సాక్షిగా 2013 జులైలో చెప్పారు.

కళంగైర్ టీవీ షేర్ హోల్డిండ్ పద్ధతి గురించి తనకు తెలియదని రాజా చెప్పారు. ఇతర పార్లమెంటు సభ్యులతో పాటు ఓ పార్లమెంటు సభ్యురాలిగా తన ఇంటికి వచ్చినప్పుడు కనిమొళిని కలిసినట్లు ఆయన తెలిపారు. కళైంగర్ గురించి రాడియాతో గానీ కనిమొళితో గానీ మాట్లాడలేదని స్పష్టం చేశారు.
రాజా క్రాస్ ఎగ్జామినేషన్ మంగళవారంనాడు జరుగుతుంది. స్పెక్ట్రమ్ కేటాయింపుల కేసులో రాజా విచారణను ఎదుర్కుంటున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications