6గురి కూతుళ్ళకు కోటిన్నర కట్నమిచ్చిన ఛాయ్ వాలా
కూతుళ్ళ పెళ్ళి ఖర్చు భరించాలంటేనే కొంతమంది తల్లిదండ్రులు ఉన్న ఆస్తులను విక్రయిస్తారు. లేదా అప్పులు చేస్తారు. మరికొందరు తల తాకట్టు పెడతారు.అయితే ధనవంతులు మాత్రం తమ కూతుళ్ళ పెళ్ళిళ్ళను ఆడంబరంగా చేస్తారు
జైపూర్: కూతుళ్ళ పెళ్ళి ఖర్చు భరించాలంటేనే కొంతమంది తల్లిదండ్రులు ఉన్న ఆస్తులను విక్రయిస్తారు. లేదా అప్పులు చేస్తారు. మరికొందరు తల తాకట్టు పెడతారు.అయితే ధనవంతులు మాత్రం తమ కూతుళ్ళ పెళ్ళిళ్ళను ఆడంబరంగా చేస్తారు. అయితే రాజస్థాన్ కు చెందిన ఓ ఛాయ్ వాలా తన కూతుళ్ళకు కోటిన్నర కట్నం ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకొన్నాడు.
ఛాయ్ వాలాకు ఇంత డబ్బు ఎక్కడిదంటూ ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లీలారామ్ గుజ్జర్, రాజస్థాన్ లో కొత్పుట్టీ సమీపంలోని వాదులా వద్ద ఓ టీ స్టాల్ ను నడుపుతున్నాడు. ఏప్రిల్ 4వ, తేదిన ఆయన తన ఆరుగురు కూతుళ్ళకు కోటిన్నర కట్నం ఇచ్చి ఈ నెల 4వ, తేదిన వివాహం జరిపించాడు.
అయితే తన కూతుళ్ళ వివాహలను పురస్కరించుకొని స్థానిక కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన పెళ్ళి వేడుకలో ఆయన పెద్ద పెద్దగా నోట్లను లెక్కపెడుతూ కట్నాన్ని అందించాడు.దీంతో బుదవారం నాడు చాయ్ వాలాకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది.
గురువారం వరకు ఆయనకు సమయాన్ని ఇచ్చింది ఆదాయపు పన్నుశాఖ. ఒకవేళ రిటర్న్స్ ను దాఖలు చేయకపోతే ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆదాయపు పన్నుశాఖ ఆ నోటీసులో పేర్కోంది.కోటిన్నర కట్నాన్ని లెక్కలో చూపని ఆదాయం కిందకు వస్తే తదుపరి విచారణను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది.
మరో వైపు నలుగురు మైనర్లకు గుజ్జర్ వివాహం జరిపించడం కూడ ఆయన మెడకు చుట్టుకొంది. ఇద్దరు పెద్ద కూతుళ్ళ పెళ్ళికి మాత్రమే ఆహ్వాన పత్రికలు పంపి, మరో నలుగురు మైనర్ కూతుళ్ళకు కూడ వివాహం జరిపించారు.అయితే నోటీసులు పంపిన తర్వాత గుజ్జర్ కుటుంబసభ్యులు ఇంట్లో లేరని పోలీసులు చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications