6గురి కూతుళ్ళకు కోటిన్నర కట్నమిచ్చిన ఛాయ్ వాలా
కూతుళ్ళ పెళ్ళి ఖర్చు భరించాలంటేనే కొంతమంది తల్లిదండ్రులు ఉన్న ఆస్తులను విక్రయిస్తారు. లేదా అప్పులు చేస్తారు. మరికొందరు తల తాకట్టు పెడతారు.అయితే ధనవంతులు మాత్రం తమ కూతుళ్ళ పెళ్ళిళ్ళను ఆడంబరంగా చేస్తారు
జైపూర్: కూతుళ్ళ పెళ్ళి ఖర్చు భరించాలంటేనే కొంతమంది తల్లిదండ్రులు ఉన్న ఆస్తులను విక్రయిస్తారు. లేదా అప్పులు చేస్తారు. మరికొందరు తల తాకట్టు పెడతారు.అయితే ధనవంతులు మాత్రం తమ కూతుళ్ళ పెళ్ళిళ్ళను ఆడంబరంగా చేస్తారు. అయితే రాజస్థాన్ కు చెందిన ఓ ఛాయ్ వాలా తన కూతుళ్ళకు కోటిన్నర కట్నం ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకొన్నాడు.
ఛాయ్ వాలాకు ఇంత డబ్బు ఎక్కడిదంటూ ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లీలారామ్ గుజ్జర్, రాజస్థాన్ లో కొత్పుట్టీ సమీపంలోని వాదులా వద్ద ఓ టీ స్టాల్ ను నడుపుతున్నాడు. ఏప్రిల్ 4వ, తేదిన ఆయన తన ఆరుగురు కూతుళ్ళకు కోటిన్నర కట్నం ఇచ్చి ఈ నెల 4వ, తేదిన వివాహం జరిపించాడు.
అయితే తన కూతుళ్ళ వివాహలను పురస్కరించుకొని స్థానిక కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన పెళ్ళి వేడుకలో ఆయన పెద్ద పెద్దగా నోట్లను లెక్కపెడుతూ కట్నాన్ని అందించాడు.దీంతో బుదవారం నాడు చాయ్ వాలాకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది.
గురువారం వరకు ఆయనకు సమయాన్ని ఇచ్చింది ఆదాయపు పన్నుశాఖ. ఒకవేళ రిటర్న్స్ ను దాఖలు చేయకపోతే ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆదాయపు పన్నుశాఖ ఆ నోటీసులో పేర్కోంది.కోటిన్నర కట్నాన్ని లెక్కలో చూపని ఆదాయం కిందకు వస్తే తదుపరి విచారణను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది.
మరో వైపు నలుగురు మైనర్లకు గుజ్జర్ వివాహం జరిపించడం కూడ ఆయన మెడకు చుట్టుకొంది. ఇద్దరు పెద్ద కూతుళ్ళ పెళ్ళికి మాత్రమే ఆహ్వాన పత్రికలు పంపి, మరో నలుగురు మైనర్ కూతుళ్ళకు కూడ వివాహం జరిపించారు.అయితే నోటీసులు పంపిన తర్వాత గుజ్జర్ కుటుంబసభ్యులు ఇంట్లో లేరని పోలీసులు చెప్పారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications