నా భర్త మీద చర్యలు తీసుకోవాలి: కేజ్రీవాల్కు లిపిక
న్యూఢిల్లీ: తన భర్త మీద కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చెయ్యాలని ఢిల్లీ శాసన సభ్యుడు సోమనాథ్ భారతి భార్య లిపిక మిత్ర మనవి చేస్తున్నారు. ఢిల్లీలో ఆమె ఢిల్లీ మహిళ కమిషన్ చేర్మెన్ బర్ఖా శుక్లాతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ తన బాధను అర్థం చేసుకుని పూర్తి వివరాలు సేకరించి తనకు న్యాయం చేస్తారని నమ్ముతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆప్ శాసన సభ్యుడు సోమనాథ్ భారతి మీద ఆయన భార్య లిపిక మిత్ర గృహ హింస కేసు పెట్టిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా ఢిల్లీ మహిళ కమిషన్ ను లిపిక మిత్ర ఆశ్రయించారు. ఢిల్లీ మహిళ కమిషన్ సోమనాథ్ భారతీకి సమన్లు జారీ చేసింది. ఈ సందర్బంలో సోమనాథ్ భారతి స్పందించారు. తనను రాజకీయంగా దెబ్బతియ్యడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అందులో భాగంగా తన మీద లిపిక మిత్ర దగ్గర కేసులు పెట్టించారని మండిపడ్డారు. చాలా కాలం నుండి తాను తన భార్య ఇంటికి వెల్లడం లేదని చెప్పారు. అలాంటి సమయంలో తన మీద లిపిక మిత్ర గృహహింస కేసు ఎలా పెడుతుందని ప్రశ్నించారు.
అయితే నిత్యం రాత్రి పూట మాత్రమే తన ఇంటికి తన భర్త సోమనాథ్ భారతి వస్తాడని లిపిక మిత్ర అంటున్నది. ఈ విషయం తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారిని అడిగితే చెబుతారని అన్నారు. తనను సోమ్ నాథ్ భారతి హింసించినట్లు వీడియో క్లిప్పింగ్ లు ఉన్నాయని లిపిక మిత్ర అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications