వైరల్ వీడియో: ఎడారిలో నేను, ఒంటె మాత్రమే ఉన్నాం.. కాపాడండి ప్లీజ్..
ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన భారత యువకుడు అక్కడ మోసపోయి ఎడారిలో చిక్కుకుపోయాడు. తనను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో సౌదీ అరేబియా దౌత్య అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టారు. ఉత్తర్ ప్రదేశ్, ప్రయాగ్ రాజ్ జిల్లాలోని హందియా ప్రాంతానికి చెందిన యువకుడు ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లగా.. అక్కడ మోసపోయినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రస్తుతం సౌదీలోని భారత దౌత్య కార్యాలయం అధికారులు యువకుడ్ని ట్రేస్ చేస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు సౌదీ అరేబియాలో మోసపోయిన ఘటన ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సౌదీ అరేబియా కఫాలా వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఘటన బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. తనకు చెప్పిన పని వేరని.. కానీ ఇక్కడ ఓ పెద్ద ఎడారిలో ఒంటెతో పాటు నన్ను వదిలేశారని ఆ యువకుడు వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. కపిల్ అనే వ్యక్తి.. తన పాస్ పోర్టును లాక్కుని చంపేస్తానని బెదిరించినట్లు తెలిపాడు. తనను కాపాడాలంటూ ఈ మేరకు ప్రధాని మోదీని వేడుకున్నాడు.. ప్లీజ్ హెల్ప్ మీ.. ఐ విల్ డై అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

" మా ఊరు అల్లహాబాద్ లో ఉంది. నేను సౌదీ అరేబియా వచ్చాను. నా పాస్ పోర్టు కపిల్ వద్ద ఉంది. నేను ఇంటికి వెళ్తానని చెబితే.. అతను నన్ను చంపేస్తానని బెదిరించాడు. నేను నా తల్లి వద్దకు వెళ్లాలి. ప్లీజ్ హెల్ప్ మీ.. ఐ విల్ డై" అంటూ భోజ్ పురీ భాషలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు యువకుడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయితే ఈ వార్త ప్రధాని మోదీ వరకు వెళ్తుందని ఆ యువకుడు వీడియోలో పేర్కొన్నాడు.
माननीय विदेश मंत्री @DrSJaishankar जी तत्काल संज्ञान मे ले, प्रयागराज हंडिया प्रतापपुर का रहने वाला फंसा सऊदी अरब मे...
— कल्पना श्रीवास्तव 🇮🇳 (@Lawyer_Kalpana) October 23, 2025
पार्ट 1 सभी भाई बहन इस वीडियो को शेयर करें ताकि इसकी सहायता हो पाए 🙏 pic.twitter.com/5op97otITq
అయితే ఈ వీడియో బయటకు వచ్చిన కొద్ది సేపటికే రియాద్ లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. ప్రస్తుతం అతడ్ని గుర్తించే పనిలో ఉంది. వీడియోలో అతను తన ప్రాంతం వివరాలను పేర్కొనలేదని దౌత్య కార్యాలయం పేర్కొంది. ఇదే విషయంపై యువకుడ్ని తక్షణమే రక్షించాలని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ను పలువురు నెటిజన్లు కోరుతున్నారు. ఇటీవల సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థను రద్దు చేశారు. ఈ సమయంలోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.
-
సిరాజ్ను చూడగానే తట్టుకోలేకపోయిన ఆశా భోస్లే మనవరాలు! వీడియో -
ఈ అడవి లోని చెట్ల మధ్య దాగి ఉన్న జంతువును చూశారా..? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి..












Click it and Unblock the Notifications