ఐఏఎస్ డికే రవి కేసు: ఎయిమ్స్ బృందం
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసులో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యుల సహకారం తీసుకుని దర్యాప్తు పూర్తి చెయ్యాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.
ఢిల్లీలోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం సీనియర్ అధికారి సుధీర్. కే. గుప్తా నేతృత్వంలోని ప్రత్యేక బృందం వైద్యులు బెంగళూరు చేరుకుని సీబీఐ అధికారుల దర్యాప్తునకు సహకరించనున్నారు. డి.కే. రవి ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పటికే లభ్యం అయిన అన్ని సాక్షాలను ఎయిమ్స్ వైద్య బృందం పరిశీలించనుంది.
డి.కే. రవి ఆత్మహత్య చేసుకున్నాడని సీఐడి అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. తరువాత సీబీఐ అధికారుల దర్యాప్తులో ఇదే విషయం వెలుగు చూసింది. అయితే రవి ఆత్మహత్య చేసుకున్న సమయంలో సేకరించిన వీడియోగ్రఫి సాక్ష్యాలు, సంఘటనా స్థలాన్ని ఎయిమ్స్ బృందం పరిశీలించనుంది.

రవి మృతదేహం మీద గుర్తించిన గాయం ఎప్పుడు అయ్యింది, ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు గాయం అయ్యిందా, రవి ఆత్మహత్య చేసుకున్నాడు అని పోస్టుమార్టం నివేదికలో కచ్చితంగా వెలుగు చూసిందా అని క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక తయారు చెయ్యనున్నారు.
డికే. రవి అనుమానాస్సద మృతి కేసు విషయంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. సీబీఐ అధికారులు దాదాపు ఈ కేసు దర్యాప్తు పూర్తి చేశారు. చివరిసారిగా ఎయిమ్స్ వైద్య బృందం సహకారంతో కేసు దర్యాప్తు పూర్తి చెయ్యాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications