'ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండరు... వారంతా సంఘ విద్రోహ శక్తులే'
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్ధలకు పూర్తి స్ధాయిలో మద్దతిస్తున్న పాకిస్ధాన్ ప్రభుత్వం, ఐఎస్ఐఎస్లపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైపూర్లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులకు సహాయ, సహకారాలు అందజేయడాన్ని వెంటనే ఆపాలని కోరారు.
ప్రపంచంలో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండరని, వారంతా సంఘ విద్రోహ శక్తులేనని చెప్పారు. ఉగ్రవాదులకు పాకిస్ధాన్ మద్దతు ఆపితేనే, దక్షిణాసియాలో పరిస్ధితి మెరుగుపడుతుందని చెప్పారు. పాకిస్ధాన్ దేశ స్వప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని వాడుకోవాడం ఆపాలని సూచించారు. ఉగ్రవాదం ప్రపంచాలని సవాలు విసురుతోందని, ఆధునిక పరిజ్ఞానంతో యువతను పెడమార్గం పట్టిస్తోందన్నారు.

గత కొన్ని దశాబ్దలుగా దేశ సరిహద్దుల్లో పాక్ నుంచి టెర్రిరిజంను ఎదుర్కొంటున్న బాధిత దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. సరిహద్దుల్లో ఇప్పటికీ లష్కరే తోయిబా, జైష్ ఈ మహ్మద్ లాంటి సంస్ధలు తమ కార్యాకలాపాల్ని కొనసాగిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు.
ఐఎస్ఐఎస్ బారిన భారతీయ ముస్లింలు ఆకర్షితులు కాకపోవడం సంతోషించే విషయమని అన్నారు. భారతీయ ముస్లింలు దేశభక్తులు. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్ధితుల్లో దరిచేరనీయరని అన్నారు. రాజస్ధాన ప్రభుత్వం సర్ధార్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ పోలీస్ వారితో కలిసి కౌంటర్-టెర్రరిజం పేరుతో మూడు రోజుల కాన్ఫరెన్స్ను నిర్వహిస్తుంది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications