ప్లాస్టిక్ జెండా ఎగరేశారో ఇక అంతే.. కఠిన చర్యలు తప్పవు, కేంద్రం వార్నింగ్..
రిపబ్లిక్ డే రోజున మువ్వన్నెల జెండా రెపరెప లాడబోతోంది. ఊరు, వాడ, పల్లె, పట్టణంలో జనవరి 26వ తేదీ వేడులకు సిద్దమవుతోంది. అయితే జెండా పండుగ రోజున జెండా ఎగరేయడం ముఖ్యం. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఈ సారి ప్లాస్టిక్ జెండా మాత్రం ఉపయోగించొద్దు అని కేంద్రం స్పష్టంచేసింది.
Recommended Video
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలో ఎక్కడ ప్లాస్టిక్ జెండాను ఎగరేయొద్దని స్పస్టంచేసింది. అలా చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 కింద చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే ప్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం నిబంధనలను అతిక్రమించొద్దు అని స్పష్టంచేసింది. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
దేశంలో స్వాతంత్ర్యం సిద్దించిన ఆగస్ట్ 15వ తేదీన పంద్రాగస్ట్ వేడుకలు నిర్వహిస్తోండగా.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశం కూడా రెండు వేడుకలను జరుపుకోదు. భారత దేశం విభిన్న సంస్కృతులు, జాతుల సమ్మేళనం. అందుకే రెండు వేడుకలను పండుగగా జరుపుకుంటోంది.