మోడీపై విమర్శలు, నిషేధం: మద్రాసు ఐఐటీ వివాదాస్పద నిర్ణయం
చెన్నై: మద్రాసు ఐఐటీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. ప్రధాని నరేంద్రమోడీని, ఆయన విధివిధానాలను విమర్శించినందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘంపై నిషేధం విధించింది. క్యాంపస్లోని అంబేద్కర్ పెరియార్ స్టూడెంట్ సర్కిల్ (ఏపీఎస్సీ)పై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.
అంతకముందు ఈ గ్రూప్ ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ, ఏపీఎస్సీ పంచిన కరపత్రాలతో క్యాంపస్లోని కొందరు విద్యార్ధులు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేంద్ర మానవ వనరుల శాఖ అదేశాల మేరకు ఏపీఎస్పీ నిషేధిస్తున్నట్లు మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రిస్కా మాథ్యూ లేఖలో పేర్కొన్నారు.
ఐఐటీ డీన్ శివకుమార్ ఎమ్ శ్రీనివాసన్ ఏపీఎస్సీ కోఆర్డినేటర్స్కు ఈ విషయంపై ఘాటైన ఈమెయిల్ పంపారు. క్యాంపస్లోని కొన్ని హిందు మత సంస్ధలు తమపై ఫిర్యాదు చేశాయని ఆరోపిస్తున్న ఏపీఎస్పీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.