Illegal affair: మొగుడికి ఏదో చెప్పింది, ప్రియుడు ఏదేదో చేశాడు, సీక్రెట్ సరసాల్లో ?
చెన్నై/ మదురై/దిండిగల్: ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లిన వివాహిత మహిళ అడ్రస్ లేకుండా పోయింది. భార్య కోసం భర్త, ఆ మహిళ కోసం ఆమె తండ్రి బంధువులు నాలుగు రోజులు గాలించి చివరికి పోలీసు కేసు పెట్టారు. మాయం అయిన మహిళకు చివరి ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. మాయం అయిన మహిళకు అక్రమ సంబంధం ఉందని ఆమె ఫోన్ కాల్స్ డేటా ద్వారా బయటపడింది. మాయం అయిన మహిళ మత్తులో ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న సమయంలోను ఆమె ప్రియుడు సజీవదహనం చేశాడు. తరువాత మేడమ్ కథ అనేక మలుపులు తిరిగిందని పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి.
Illegal affair: జాతకంతో పాటు ఆంటీకి అన్నీ చూసిన జ్యోతిష్యుడు, నడిరోడ్లో ఔట్!
చక్కటి కాపురం
తమిళనాడులోని దిండిగల్ జిల్లా వడమదురై సమీపంలోని అక్సాఅయ్యలూర్ కు చెందిన సెంథిల్ మణి అనే వ్యక్తి మదురైకి చెందిన రంజిత (26) అనే యువతిని ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. సెంథిల్ మణి, రంజిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య రంజిత, ఇద్దరు పిల్లలతో కలిసి సెంథిల్ మణి సంతోషంగా జీవిస్తూ వచ్చాడు.
అసుపత్రికి అని చెప్పి అడ్రాస్ లేకుండా పోయింది
మార్చి 29వ తేదీన తాను ఆసుపత్రికి వెళ్లి వస్తానని భర్త సెంథిల్ మణికి చెప్పిన రంజిత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తరువాత రంజిత అడ్రస్ లేకుండా పోవడంతో ఆమె భర్త సెంథిల్ మణి, ఆమె తండ్రి మురగేషన్, బంధువులు ఆమె కోసం నాలుగు రోజుల పాటు అనేక ప్రాంతాల్లో గాలించారు.
రంజిత ఫోన్ నెంబర్
రంజిత ఆచూకిలేకపోవడతో ఆమె తండ్రి మురగేషన్ ఉత్తర మదురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేసినా కొన్ని రోజుల పాటు రంజిత ఆచూకి ఏమాత్రం చిక్కలేదు. చివరికి పోలీసులు రంజిత మొబైల్ నెంబర్ ఆధారంగా విచారణ చేశారు. రంజిత ప్రతిరోజు ఎక్కువ సార్లు ఓ వ్యక్తితో ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడిందని పోలీసులు గుర్తించారు.
ఫ్రెండ్ కాదు.... మేడమ్ ప్రియుడు
తమిళనాడులోని దిండుగల్ జిల్లా కుజిలియంపారా సమీపంలోని ఆర్. పుదుకోటైకి చెందిన డ్రైవర్ రాజ్ కుమార్ (30) అనే యువకుడి పేరు తెరమీదకు వచ్చింది. రాజ్ కుమార్ కు ఇంతకు ముందే వివాహం అయ్యిందని, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు గుర్తించారు. మాయం అయిన రంజితకు రాజ్ కుమార్ ఫ్రెండ్ కాదని, అతను ఆమె ప్రియుడు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
రంజిత సీక్రెట్ జల్సాలు
రాజ్ కుమార్, రంజితకు అక్రమ సంబంధం ఉందని, వారిద్దరు అనేకసార్లు రహస్యంగా కలుసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పోలీసుల విచారణలో రాజ్ కుమార్ మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్పడంతో పోలీసులు, రంజిత కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. రంజితను తాను చంపేశానని రాజ్ కుమార్ పోలీసుల విచారణలో అంగీకరించారు.
రొమాన్స్ టైమ్ లో తేడా వచ్చింది
ఆసుపత్రికి అని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన రంజిత నేరుగా తన దగ్గరకు వచ్చిందని రాజ్ కుమార్ పోలీసులకు చెప్పాడు. రంజిత తాను ఎంజాయ్ చెయ్యడానికి వేదాసందూర్ సమీపంలోని అటవి ప్రాంతంలోకి వెళ్లామని రాజ్ కుమార్ పోలీసులకు చెప్పాడు. ఏకాంతంగా ఎంజాయ్ చేసే సమయంలో మా మధ్య తేడా వచ్చింది. ఓ విషయంలో ఇద్దరు గొడవపడ్డామని రాజ్ కుమార్ పోలీసులకు చెప్పాడు.
ప్రియురాలి మీద పెట్రోల్ పోసి సజీవదహనం
మద్యం మత్తులో తాము ఇద్దరూ ఉన్నామని, ఆ సమయంలో గొడవ ఎక్కువ కావడంతో మందుగా తాను వెంట తీసుకెళ్లిన పెట్రోల్ తన ప్రియురాలు రంజిత మీద పోసి ఆమె ప్రాణాలతో ఉన్నట్లే నిప్పంటించి సజీవదహనం చేశానని రాజ్ కుమార్ పోలీసులకు చెప్పాడు. శవం ఆనవాళ్ల కూడా చిక్కకుండా రంజిత శవాన్ని కాల్చి బూడిద చేశానని రాజ్ కుమార్ చెప్పడంతో పోలీసులతో పాటు రంజిత కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
చిన్న తేడాతో ప్రియురాలు ఫినిష్
రంజితను సజీవదహనం చేసిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. రంజిత శవం పూర్తిగా కాలిపోయిందని, రాజ్ కుమార్ ను అరెస్టు చేశామని ఉత్తర మదురై పోలీసులు అంటున్నారు. రొమాన్స్ టైమ్ లో తేడా రావడంతోను రాజ్ కుమార్ అతని ప్రియురాలు రంజితను చంపేశాడని పోలీసులు అంటున్నారు.