Illegal affair: పక్కఊర్లో కూతురు కాపురం, ఇంట్లో ప్రియుడితో ఆంటీ, విసిగిపోయిన భర్త కత్తితో!
శ్రీనగర్/ కాశ్మీర్: 25 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగానే కాపురం చేశారు. తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. దంపతుల కూతురు వివాహం చేసుకుని పక్కఊర్లో ఆమె భర్తతో కాపురం చేస్తూ నివాసం ఉంటున్నది. 50 ఏళ్ల వయసులో తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు తెలిసింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. చాలాకాలం నుంచి దంపతుల మద్య గొడవలు జరగడంతో కుటుంబ సభ్యులు సర్దిచెబుతూ వచ్చారు. ఎవరు ఎన్ని చెప్పినా నా భార్యా మాత్రం పద్దతి మార్చుకోవడం లేదని భర్త రగిలిపోయాడు.
ఇదే సమయంలో ఇంట్లో భార్య గొంతు కోసేసిన విషయం గుర్తించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై భార్య ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సంఘటనా స్థలంలోని సాక్షాల ఆధారంగా, ప్రత్యక్షసాక్షుల ఇచ్చిన సమాచారం మేరకు భార్య హత్య కేసులో ఆమె భర్తను పోలీసులు పట్టుకున్నారు. అక్రమసంబంధం కారణంగా భార్యను ఆమె భర్త హత్య చేశాడని అంగీకరించాడని పోలీసులు అన్నారు. ఈ వయసులో తన భార్యకు పోయేకాలం దాపురించిందని, అందుకే చంపేశానని భర్త అంగీకరించాడని పోలీసు అధికారులు అంటున్నారు.

శ్రీనగర్ లో దంపతులు
జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లోని జకురా ప్రాంతంలోని గులాబ్ బాగ్ ఏరియాలోని గులిస్తాన్ కాలనీలో అబ్దుల్ రెహ్మాన్ దార్, సలీమా (50) దంపతులు నివాసం ఉంటున్నారు. 25 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న అబ్దుల్ రెహ్మాన్, సలీమా దంపతులు కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగానే కాపురం చేశారు. తరువాత అబ్దుల్ రెహ్మాన్, సలీమా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

పిల్లలకు కూడా వివాహాలు జరిగిపోయాయి
అబ్దుల్ రెహ్మాన్, సలీమా దంపతుల పిల్లలు వివాహం చేసుకుని ఎవరిపాటివారు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. 50 ఏళ్ల వయసులో తన భార్య సలీమా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త అబ్దుల్ రెహ్మాన్ కు తెలిసింది. ఇదే విషయంలో అబ్దుల్ రెహ్మాన్, సలీమా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి.

కూతురు అక్కడ కాపురం చేస్తుంటే నువ్వు ఇక్కడ కాపురం చేస్తున్నావా ?
చాలాకాలం నుంచి అబ్దుల్ రెహ్మాన్, సలీమా దంపతుల మద్య గొడవలు జరగడంతో కుటుంబ సభ్యులు సర్దిచెబుతూ వచ్చారు. పిల్లలు పెళ్లి చేసుకుని వారు కాపురాలు చేస్తుంటే 50 ఏళ్ల వయసులో నువ్వు ఇక్కడ వేరే వ్యక్తితో ఎంజాయ్ చేస్తున్నావా ? అంటూ సలీమాను ఆమె భర్త అబ్దుల్ రెహ్మాన్ మందలించాడని తెలిసింది.

ఇంట్లో సైలెంట్ గా భార్య గొంతు కోసేశాడు
ఎవరు ఎన్ని చెప్పినా నా భార్యా సలీమా మాత్రం పద్దతి మార్చుకోవడం లేదని ఆమె భర్త అబ్దుల్ రెహ్మాన్ రగిలిపోయాడు. ఇదే సమయంలో ఇంట్లో సలీమా గొంతు కోసేసిన విషయం గుర్తించిన స్థానికులు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సలీమా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

పోలీసు అధికారులు ఎంట్రీ
విషయం తెలుసుకున్న స్థానిక జిల్లా ఎస్పీ హజరత్ బల్, స్థానిక పోలీసు అధికారులు షోకెట్ మోహమ్మద్, షర్వేజ్ అహమ్మద్, వేలిముద్రల నిపుణులు సంఘటనా స్థాలానికి చేరుకుని సలీమా హత్యకు గురైన తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రత్యక్షసాక్షుల ఇచ్చిన సమాచారం మేరకు సలీమా భర్త అబ్దుల్ రెహ్మాన్ ను పోలీసులు పట్టుకున్నారు.
Recommended Video

బెండ్ తీస్తే స్టోరీ మొత్తం చెప్పిన భర్త
మొదట తన భార్య సలీమాను ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని అబ్దుల్ రెహ్మాన్ చెప్పాడని, అతనికి ట్రీట్ మెంట్ ఇస్తే తరువాత అసలు నేరం అంగీకరించాడని జిల్లా ఎస్పీ హజరత్ బల్ మీడియాకు చెప్పారు. అక్రమసంబంధం కారణంగా తన భార్య సలీమాను తానే హత్య చేశానని ఆమె భర్త అబ్దుల్ రెహ్మాన్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. ఈ వయసులో తన భార్య సలీమాకు పోయేకాలం దాపురించిందని, అందుకే చంపేశానని అబ్దుల్ రెహ్మాన్ అంగీకరించాడని పోలీసు అధికారులు స్థానిక మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications