Illegal affair: వావీవరసలు లేకుండా అక్రమ సంబంధం, క్యూలో బాయ్స్, భర్త, సోదరుడు కలిసి !
బెంగళూరు/ బళ్లారి: భర్తతో కాపురం చేస్తున్న భార్య విచ్చలవిడిగా తయారైయ్యింది. భర్త, పుట్టింటి వారి మంచి తనాన్ని చేతకానితనంగా బావించిన ఆమె బంధువులతో పాటు గ్రామంలోని చాలా మందితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త బయటకు వెళ్లిన తరువాత బంధువులతో పాటు గ్రామంలో ఉన్న ప్రియులను రోజుకు ఒకరిని ఇంటికి పిలిపించుకుంటున్న ఆమె వారితో ఎంజాయ్ చేసింది. మహిళ బరితెగించిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అనేకసార్లు మందలించారు. అయినా చెప్పినమాట వినకపోవడంతో ఆమెను భర్త చితకబాదుతున్నాడు. 20 రోజుల క్రితం ఓ ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది. అప్పటి నుంచి ఆమె కోసం కుటుంబ సభ్యులు బంధువులు వెతుకుతూనే ఉన్నారు. తన భార్య కనపడటం లేదని ఆమె భర్త మిస్సింగ్ కేసు పెట్టాడు. ఇదే సమయంలో ఓ గ్రామం శివార్లలోలని కొండగుట్ట మీద ఆమె శవమై కనిపించింది. ప్రియుడితో పారిపోయిన మహిళను హత్య చేసి ఆమె శవానికి నిప్పంటించి కాల్చివేయడానికి ప్రయత్నించడంతో శవం అర్దకాలిపోయింది.
Illegal affair: భార్యను చంపేసి పుణ్యక్షేత్రంలో మొక్కు తీర్చుకున్న వ్యాపారి, మరిదితో లింక్!
భర్తతో కాపురం..... అందరి మీద వ్యామోహం
కర్ణాటకలోని హావేరి జిల్లాలోని గుత్తలన సమీపంలోని కెరకోప్ప గ్రామంలో హనుమంతప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 13 సంవత్సరాల క్రితం శేఖశ్రీ (32) అనే మహిళను హనుమంతప్ప వివాహం చేసుకున్నాడు. హనుమంతప్ప వ్యవసాయం చేస్తున్నాడు. భర్త హనుమంతప్పతో కాపురం చేస్తున్న శేఖశ్రీ పలువురి మీద వ్యామోహం పెంచుకుంది.
బంధువులుతో అక్రమ సంబంధం
భర్త హనుమంతప్పతో కాపురం చేస్తున్న అతని భార్య శేఖశ్రీ విచ్చలవిడిగా తయారైయ్యింది. భర్త హనుమంతప్ప, పుట్టింటి వారి మంచితనాన్ని చేతకానితనంగా బావించిన శేఖశ్రీ తెలిసిన బంధువులు చాలా మందితో అక్రమ సంబంధం పెట్టుకుంది. హనుమంతప్ప ఇంటికి వచ్చి వెలుతున్న బంధువులను లైన్ లో పెట్టిన శేఖశ్రీ వారితో ఎంజాయ్ చేసింది.
గ్రామస్తులను వదల్లేదు
బంధువులతో పాటు కెరకోప్ప గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లోని యువకులతో శేఖశ్రీ అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త హనుమంతప్ప ఇంటి నుంచి యటకు వెళ్లిన తరువాత బంధువులతో పాటు గ్రామంలో ఉన్న ప్రియులను రోజుకు ఒకరిని ఇంటికి పిలిపించుకుంటున్న శేఖశ్రీ వారితో ఎంజాయ్ చేసింది.
ప్రియుడితో లేచిపోయింది
శేఖశ్రీ
బరితెగించిపోవడంతో
ఆమె
కుటుంబ
సభ్యులు
అనేకసార్లు
మందలించారు.
అయినా
శేఖశ్రీ
చెప్పినమాట
వినకపోవడంతో
ఆమెను
భర్త
హనుమంతప్ప
చితకబాదుతున్నాడు.
20
రోజుల
క్రితం
ఓ
ప్రియుడితో
కలిసి
శేఖశ్రీ
పారిపోయింది.
అప్పటి
నుంచి
శేఖశ్రీ
కోసం
కుటుంబ
సభ్యులు,
బంధువులు,
భర్త
హనుమంతప్ప
వెతుకుతూనే
ఉన్నా
ఆమె
మాత్రం
ఎవ్వరికి
చిక్కలేదు.
నమ్మించి పిలుచుకుని వెళ్లిన తమ్ముడు
ప్రియుడితో కలిసి శేఖశ్రీ ఓ ప్రాంతంలో ఉందని ఆమె సోదరుడు బసవరాజ్ కు తెలిసింది. వెంటనే బసవరాజ్ అతని బావ హనుమంతప్పకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరు మాట్లాడుకుని శేఖశ్రీని చంపేయాలని డిసైడ్ అయ్యారు. బసరాజ్ శేఖశ్రీ దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలని ఆమెను బైక్ లో పిలుచుకుని కొండ గుట్ట మీదకు వెళ్లాడు. అప్పటికే అక్కడున్న భర్త హనుమంతప్ప శేఖశ్రీని పట్టుకున్నాడు.
లేడీ లవర్ ను చంపేసిన భర్త, సోదరుడు
సోదరుడు బసవరాజ్, భర్త హనుమంతప్ప కలిసి శేఖశ్రీ కాళ్లు చేతులు కట్టేసి టవల్ తో ఆమె గొంతు బిగించి చంపేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైనారు. తన భార్య శేఖశ్రీ కనపడటం లేదని ఆమె భర్త హనుమంతప్ప మిస్సింగ్ కేసు పెట్టాడు. ఇదే సమయంలో ఓ గ్రామం శివార్లలోని కొండగుట్ట మీద శేఖశ్రీ శవమై కనిపించింది. ప్రియుడితో పారిపోయిన శేఖశ్రీని హత్య చేసింది ఆమె భర్త హనుమంతప్ప, సోదరుడు బసవరాజ్ అని తెలుసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పది మందికిపైగా యువకులతో అక్రమ సంబంధం పెట్టుకున్న శేఖశ్రీ హత్యకు ఆమె కుటుంబ సభ్యుల చేతిలోనే హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.