Illegal affair: భార్య, పొలిటికల్ లీడర్ ను నరికి చంపేసిన భర్త, ఎంత చెప్పినా ?, పలుకుబడితో జల్సా !
బెంగళూరు: పొలిటికల్ లీడర్ గ్రామ పంచాయితీ అధ్యక్షుడిగా పని చేశాడు. పార్టీలతో సంబంధం లేకుండా అతను అందరితో కలిసిపోతున్నాడు. గత ఎన్నికల్లో అతను మాజీ గ్రామ పంచాయితీ అధ్యక్షుడు అయ్యాడు. ప్రస్తుతం గ్రామ పంచాయితీ సభ్యుడిగా ఫని చేస్తున్న అతను మంచి పలుకుబడి పెట్టుకున్నాడు. బిగ్ షాట్ అయిన ఆ పొలిటికల్ లీడర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మాజీ గ్రామ పంచాయితీ అధ్యక్షుడిని ప్రత్యర్థులు వెంటాడి అతి దారుణంగా చంపేశారు. పోలిటికల్ లీడర్ హత్యకు గురైన ప్రాంతంలోనే మరో యువతి దారుణ హత్యకు గురి అయ్యింది. పొలిటికల్ లీడర్ తో ఆమె అక్రమ సంబందం పెట్టుకుందని వెలుగు చూసింది. వివాహం చేసుకున్న భర్తతో కలిసి జీవిస్తున్న ఆమె పొలిటికల్ లీడర్ తో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని, ఆ విషయం తెలిసి ఆమె భర్త స్నేహితులతో కలిసి ఇద్దర్ని చంపేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. పొలిటికల్ పవర్ తో పక్కింటోడి భార్యతో ఎంజాయ్ చేస్తూ భర్తను లెక్క చెయ్యకుండా ఎంజాయ్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాజకీయ నాయకుడు, అతని ప్రియురాలు ఒకేసారి హత్యకు గురి కావడం కలకలం రేపింది.

జేడీఎస్ లీడర్
ఐటీ హబ్ సమీపంలోని బెంగళూరు గ్రామీణ జిల్లాలోని బ్యాడరహళ్ళిలో నారాయణస్వామి అలియాస్ దాస అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఐటీ హబ్ బెంగళూరు సిటీ సమీపంలో నివాసం ఉంటున్న జేడీఎస్ పార్టీ లీడర్ నారాయణస్వామి బ్యాడరహళ్ళి గ్రామ పంచాయితీ అధ్యక్షుడిగా పని చేశాడు. పార్టీలతో సంబంధం లేకుండా నారాయణస్వామి అందరితో కలిసిపోయి మంచి పేరు సంపాధించుకున్నాడు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం
గత ఎన్నికల్లో నారాయణస్వామి మాజీ గ్రామ పంచాయితీ అధ్యక్షుడిగా ఓడిపోయాడు. ప్రస్తుతం నారాయణస్వామి గ్రామ పంచాయితీ సభ్యుడిగా ఉన్నాడు. పదవి లేకున్నా నారాయణస్వామి స్థానికంగా అక్కడి ప్రజల్లో మంచి పలుకుబడి పెట్టుకున్నాడు. బిగ్ షాట్ అయిన జేడీఎస్ పార్టీ లీడర్ నారాయణస్వామి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.

వివాహిత మహిళతో అక్రమ సంబంధం
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని సూర్యాసిటీ నగర్ సమీపంలోని రామయ్య లేఔట్ లో ముత్తురాజ్, కావ్యా (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న కావ్యాతో జేడీఎస్ పార్టీ లీడర్ నారాయణస్వామి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్త ముత్తురాజ్ లేని సమయంలో కావ్యా ఆమె ప్రియుడు నారాయస్వామితో ఎంజాయ్ చేస్తోంది.

వార్నింగ్ ఇచ్చినా ఇద్దరూ లెక్కచెయ్యలేదు
భార్య కావ్యా, నారాయణస్వామి అక్రమ సంబంధం పెట్టుకున్నారని కొంతకాలం క్రితమే ఆమె భర్త ముత్తురాజ్ కు తెలిసిపోయింది. పద్దతి మార్చుకోవాలని ముత్తురాజ్ అతని భార్య కావ్యాతో పాటు జేడీఎస్ పార్టీ లీడర్ నారాయణస్వామిని హెచ్చరించారు. అయితే తన రాజకీయ పలుకుబడితో నారాయణస్వామి ముత్తురాజ్ ను ఏమాత్రం లెక్కచెయ్యలేదని తెలిసింది.

ఆటోలో వెళ్లి నరికేశారు
శనివారం సాయంత్రం ముత్తురాజ్ తాను పని మీద హోసూరుకు వెలుతున్నానని, ఆదివారం ఇంటికి వస్తానని అతని భార్య కావ్యాకు అపద్దం చెప్పాడు. భర్త ముత్తురాజ్ ఊరికి వెళ్లిపోయాడని అనుకున్న కావ్యా ఆమె ప్రియుడు నారాయణస్వామిని ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడు నారాయణస్వామితో కావ్యా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ముత్తురాజ్, అతని స్నేహితులు ముగ్గురు ఆటోలో ఇంటి దగ్గరకు వెళ్లారు.
Recommended Video

దారుణంగా నరికి చంపేసిన భర్త
ప్రియురాలు కావ్యా భర్త ముత్తురాజ్ ఎంట్రీతో నారాయణస్వామి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. రామయ్య లేఔట్ లో జేడీఎస్ పార్టీ లీడర్ నారాయణస్వామి మీద ముత్తురాజ్, అతని స్నేహితులు దాడి చేశారు. బ్యాడరహళ్ళి మాజీ గ్రామ పంచాయితీ అధ్యక్షుడు నారాయణస్వామిని వెంటాడి వెంటాడి అతి దారుణంగా నరికి చంపేశారు. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న కావ్యాను కూడా దారుణంగా చంపేసిన ఆమె ముత్తురాజ్ స్నేహితులతో కలిసి అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు. అక్రమ సంబంధం కారణ:గా పొలిటికల్ లీడర్ నారాయణస్వామి, అతని ప్రియురాలు కావ్యా ఆమె భర్త ముత్తురాజ్ చేతిలో హత్యకు గురికావడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications