Khiladi wife: ఉద్యోగం చేస్తున్న చోట భార్యకు ప్రియుడు, ఇంట్లో శవమైన మొగుడు, ఫోన్ కాల్స్ దెబ్బతో !
న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. కొన్ని సంవత్సరాల తరువాత భార్య ఆమె ఉద్యోగం చేస్తున్న చోటే పని చేస్తున్న ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. భార్య మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న భర్త ఆమె గురించి ఎక్కువగా ఆలోచించలేదని తెలిసింది. తన అక్రమ సంబంధం గురించి తన భర్త గుర్తించలేకపోయాడని భార్య రెచ్చిపోయింది. ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్న భార్య అసలు మ్యాటర్ ఆమె భర్తకు తెలిసిపోయింది. అక్కడ భార్య రొమాన్స్ కథ రివర్స్ అయ్యింది. భర్తకు తీవ్రగాయాలై ఇంట్లో రక్తపుమడుగులో శవమై కనిపించాడు. మెడ,తల మీద కత్తిపోట్లు పడటంతో భర్త ప్రాణం పోయిందని పోలీసులు గుర్తించారు. భార్య మొబైల్ ఫోన్ కాల్ డేటా బయటకు లాగడంతో ఆమె అక్రమ సంబంధం విషయం పూర్తిగా బయటకు వచ్చింది. భార్య ఇచ్చిన సమాచారంతో వేరే రాష్ట్రానికి పారిపోతున్న ఆమె కిలాడి ప్రియుడిని పోలీసులు సినిమా స్టైల్లో అరెస్టు చేశారు.

ఉద్యోగం చేస్తున్న మహిళకు ?
దేశరాజధాని ఢిల్లీలోని కల్కాజీ ఏరియాలో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రాకేష్ స్వర్ణాలి ఘోష అలియాస్ స్వర్ణాలి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రాకేష్ ను వివాహం చేసుకున్న స్వర్ణాలి ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. స్వర్ణాలి ఢిల్లీలోని పుష్పవతి సిఘానియా రీసెర్చ్ ఇన్సిట్యూట్ లో ఉద్యోగం చేస్తున్నది.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత స్వర్ణాలి ఆమె ఉద్యోగం చేస్తున్న చోటే పని చేస్తున్న మోహన్ పాల్ అనే వ్యక్తితో చనువు పెంచుకుని అతన్ని ప్రియుడిగా సెట్ చేసుకుని ఎంజాయ్ చేసింది. భార్య స్వర్ణాలి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న భర్త రాకేష్ ఆమె గురించి ఎక్కువగా ఆలోచించలేకపోయాడని తెలిసింది.

భర్తకు మ్యాటర్ లీక్
తన అక్రమ సంబంధం గురించి తన భర్త రాకేష్ గుర్తించలేకపోయాడని అతని భార్య స్వర్ణాలి రెచ్చిపోయింది. ఉద్యోగానికి వెళ్లి వస్తున్న స్వర్ణాలి పనిలో పనిగా ఆమె ప్రియుడు మోహన్ పాల్ తో ఎంజాయ్ చేస్తూ ఇంతకాలం గడిపేసింది. అయితే ఇటీవల రాకేష్ కు అతని భార్య స్వర్ణాలి, ఆమె ప్రియుడు మోహన్ పాల్ ల అక్రమ సంబంధం విషయం తెలిసిపోయింది.

ఇంట్లో శవమైన భర్త
తలకు తీవ్రగాయాలైన రాకేష్ అతని ఇంట్లో రక్తపుమడుగులో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న కల్కాజీ పోలీసులు రంగంలోకి దిగి కేసు విచారణ చేశారు. రాకేష్ మెడ, తల మీద కత్తిపోట్లు పడటంతో అతని ప్రాణం పోయిందని పోస్టుమార్టం నివేదిక చూసిన పోలీసులు అసలు మ్యాటర్ తెలుసుకున్నారు.

కన్నింగ్ పెళ్లామ్, కిలాడి ప్రియుడు
రాకేష్ హత్యకు గురైనాడని పోలీసులు ఓ క్లారిటీకి వచ్చేశారు. రాకేష్ భార్య స్వర్ణాలి మొబైల్ ఫోన్ నెంబర్ కాల్ డేటా బయటకు లాగడంతో ఆమె అక్రమ సంబంధం విషయం పూర్తిగా బయటకు వచ్చింది. స్వర్ణాలి ఇచ్చిన సమాచారంతో ఆమె కన్నింగ్ ప్రియుడు మోహన్ పాల్ కోసం పోలీసులు గాలించారు.

ఏదో అనుకుంటే ఏదో జరిగింది
ఢిల్లీ నుంచి పారిపోయిన మోహన్ పాల్ పశ్చిమ బెంగాల్ లోని సిలిగురికి పారిపోతున్న ఆమె కిలాడి ప్రియుడిని పోలీసులు సినిమా స్టైల్లో వెంటాడి అరెస్టు చేశారు. తన ప్రియుడు మోహన్ పాల్ తో కలిసి తన భర్తను హత్య చేశామని స్వర్ణాలి అంగీకరించిందని పోలీసులు అన్నారు. హత్యకు ఉపయోగించిన హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులు స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications