Illegal affair: హోటల్స్, లాడ్జ్ ల్లో ఆంటీతో ఎంజాయ్, విహారయాత్రలో ప్రియుడు ఏం చేశాడంటే ? !
బెంగళూరు/మండ్య: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత ఆమెకు మేస్త్రీతో పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. విహారయాత్రలకు వెళ్లి లాడ్జ్ లో రూమ్ లు తీసుకుని జల్సా చేశారు. విహారయాత్రకు వెళ్లిన ఇద్దరూ రెండు రోజుల పాటు ఆ సిటీలోనే ఉన్నారు. తరువాత ఇద్దరూ వేరే ఊరికి విహారయాత్రకు బయలుదేరారు. మార్గం మద్యలో పట్టపగలు పక్కనే నడుచుకుంటూ ఆ ప్రాంతాలు చూస్తూ వెలుతున్న ప్రియురాలి మీద ఆమెప్రియుడు కొడవలి తీసుకుని నరికేశాడు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ఆంటీ మీద ఆమె ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

భర్త చనిపోయాడు
కర్ణాటకలోని మండ్య జిల్లాలోని నాగమంగలలో ప్రభా (42) అనే మహిళ నివాసం ఉంటున్నది. పాపన్న అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ప్రభా నాగమంగలలోనే ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. మూడు సంవత్సరాల క్రితం ప్రభా భర్త పాపన్న అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి సంవత్సరం పాటు ప్రభా ఒంటరిగా నాగమంగలలోనే ఉంది.

ప్రియుడిని సెట్ చేసుకున్న ఆంటీ
బెంగళూరులోని గోల్లరహట్టిలో నివాసం ఉంటున్న మేస్త్రీ బసవరాజ్ ప్రభా ఆంటీకి పరిచయం అయ్యాడు. కొంతకాలం అప్పుడప్పుడు కలుస్తున్న ప్రభా, బసవరాజ్ తరువాత అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. పలు ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లిన బసవరాజ్, ప్రభా ఆ ప్రాంతాల్లో లాడ్జ్ లో రూమ్ లు తీసుకుని జల్సా చేశారు.

మైసూరులో రెండు రోజులు ఎంజాయ్
మూడు రోజుల క్రితం బసవరాజ్, ప్రభా ఆంటీ మైసూరు సిటీకి వెళ్లి అక్కడ లాడ్జ్ లో రూమ్ తీసుకున్నారు. మైసూరు నగరంతో పాటు మలేమహేశ్వర బెట్ట (కొండ)పరిసర ప్రాంతాల్లో సంచరించిన బసవరాజ్, ప్రభా రెండు రోజులు రాత్రి మైసూరులోని లాడ్జ్ లోనే ఉన్నారు.ఇంకా ఒక్కరోజు ఇక్కడే ఉందామని బసవరాజ్ చెప్పినా అతని ప్రియురాలు ప్రభా అంగీకరించలేదని తెలిసింది.

కొడవలితో నరికేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు
ఉదయం మైసూరు నుంచి బయలుదేరిన తరువాత సూళకెరె పరిసర ప్రాంతాల్లోకి బసవరాజ్, ప్రభా విహారయాత్రకు బయలుదేరారు. మార్గం మద్యలో సూళకెరె సమీపంలో పట్టపగలు పక్కనే నడుచుకుంటూ ఆ ప్రాంతాలు చూస్తూ వెలుతున్న ప్రభా ఆంటీ మీద ఆమె ప్రియుడు బసవరాజ్ కొడవలి తీసుకుని నరికేశాడు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ప్రభా ఆంటీ మీద ఆమె ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేయడానికి ప్రయత్నించాడు.

కేటుగాడు ఎస్కేప్
ఆ సమయంలో అటువైపు స్థానికులు కొందరు వస్తున్న విషయం గమనించిన బసవరాజ్ అక్కడి నుంచి పరారైనాడు. తీవ్రగాయాలైన ప్రభాను ఆసుపత్రికి తరలించారు. ప్రభా మరో వ్యక్తితో చనువుగా ఉందని కోపంతో బసవరాజ్ ఆమెను చంపేయాలని అనుకున్నాడని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications