Wife: భార్యకు అక్రమ సంబంధం, ప్రియుడి దగ్గర రూ. 30 లక్షలు స్వాహా, క్లైమాక్స్ లో భార్య,భర్త !
చెన్నై/కన్యాకుమారి: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. వివాహం జరిగి సంవత్సరాలు గడిచిపోతున్నా దంపతులకు పిల్లలు మాత్రం పుట్టలేదు. కాంట్రాక్టు పనులు చేస్తున్త భర్త బిజీగా బయట గడుపుతున్నాడు ఇదే సమయంలో భార్య ఓ యువకుడితో పరిచయం పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడికి స్వర్గం చూపిస్తున్న భార్య అతన్ని ఆమె వలలో వేసుకుంది. నా భర్తను వదిలేసి నీతో వచ్చేస్తానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రియుడిని నమ్మించింది. పడక సుఖం ఇస్తున్న ప్రియురాలు ఆమె ప్రియుడి దగ్గర రూ. 30 లక్షలపైగా డబ్బులు తీసుకుంది.
ప్రియురాలు ఎంతకాలమైనా పెళ్లి చేసుకోవడానికి రాకపోవడంతో ఎలాగైన ఇచ్చిన డబ్బు మొత్తం వసూలు చెయ్యాలని ప్రియుడు డిసైడ్ అయ్యాడు. ప్రియురాలి ఇంటి దగ్గరకు ప్రియుడు వెళ్లి చూశాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో కొంతదూరం వెనక్కి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చి మళ్లీ ప్రియురాలి ఇంటి దగ్గరకు ప్రియుడు వెళ్లి కిటికీలో చూశాడు. ఇంట్లో ప్రియురాలితో పాటు ఆమె భర్త శవమై కనిపించడతో ప్రియుడు బిత్తరపోయాడు.
Family: రెండో భార్య మోజులో కానీస్టేబుల్, మొదటి భార్య కొడుకు, కూతురు ఏం చేశారంటే ?, ఏదో అనుకుంటే!
10 ఏళ్ల క్రితం పెళ్లి
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని సూర్యకోడు ములంకుజి ప్రాంతంలో జాన్సన్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్లంబర్ కాంట్రాక్టు పనులు చేస్తున్న జాన్సన్ సంధ్యా (34) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.10 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న జాన్సన్, సంధ్యా దంపతులు సంతోషంగా కాపురం చేశారు.
పిల్లలు పుట్టలేదని ఆవేదన
వివాహం జరిగి సంవత్సరాలు గడిచిపోతున్నా జాన్సన్, సంధ్యా దంపతులకు పిల్లలు మాత్రం పుట్టలేదు. ప్లంబింగ్ కాంట్రాక్టు పనులు చేస్తున్త జాన్సన్ బయట ఎక్కువగా బిజీగా బయట గడుపుతున్నాడు. మాకు పిల్లలు పుట్టలేదని జాన్సన్, సంధ్యా వాళ్ల స్నేహితుల దగ్గర విచారం వ్యక్తం చేశారని సమాచారం.
ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
కన్యాకుమారి జిల్లాలోని అలగన్ వరై ప్రాంతంలో నివాసం ఉంటున్న వర్గీస్ అనే మహిళ కుమారుడు ఆండ్రో ప్రాబ్లిన్ అనే యువకుడతో సంధ్యాకు పరిచయం అయ్యింది. పరిచయం పెంచుకుని ఆండ్రోతో సంధ్యా అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు ఆండ్రోకు మంచం మీద స్వర్గం చూపిస్తున్న సంధ్యా అతన్ని పూర్తిగా ఆమె వలలో వేసుకుంది.
పెళ్లి చేసుకుంటానని రూ. 30 లక్షలు స్వాహా
ఆండ్రో కూడా సంధ్యా మోజులో పడిపోయాడు. నా భర్త జాన్సన్ ను వదిలేసి నీతో వచ్చేస్తానని, మనం కాపురం చేసి పిల్లల్ని కందామని, నిన్ను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని సంధ్యా ఆమె ప్రియుడు ఆండ్రోను నమ్మించింది. ఆండ్రోకు పడక సుఖం ఇస్తున్న ప్రియురాలు సంధ్యా అతని దగ్గర సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ. 30 లక్షలపైగా డబ్బులు తీసుకుంది.
మనసు మార్చుకున్న ప్రియురాలు
సంధ్యా అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తనను వదిలేసి ఆండ్రోను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నదని ఆమె భర్త జాన్సన్ కు తెలిసిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరిగాయి. తరువాత సంధ్యా మనసు మార్చుకుందని తెలిసింది. ఎంతకాలమైనా ప్రియురాలు సంధ్యా నన్ను పెళ్లి చేసుకోవడానికి రావడం లేదని, ఎలాగైన ఇచ్చిన రూ. 30 లక్షలు ఆమె నుంచి వసూలు చెయ్యాలని ప్రియుడు ఆండ్రో డిసైడ్ అయ్యాడు.
ఆవేశంతో ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు
ఆండ్రో అతని తల్లి వర్గీస్ ను వెంటపెట్టుకుని ప్రియురాలు సంధ్యా ఇంటి దగ్గరకు వెళ్లి డబ్బులు వసూలు చెయ్యాలని ప్రయత్నించాడు. సంధ్యా ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆండ్రో ఆమె తల్లి వర్గీస్ తో కలిసి కొంతదూరం వెనక్కి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చి ఆండ్రో మళ్లీ ప్రియురాలు సంధ్యా ఇంటి దగ్గరకు వెళ్లి కిటికీలో చూశాడు.
భర్తతో కలిసి శవమై కనిపించిన భార్య
ఇంట్లో ప్రియురాలు సంధ్యా బెడ్ మీద శవమై కనిపించడం. ఫ్యాన్ కు ఆమె భర్త జాన్సన్ ఉరి వేసుకుని కనపడంతో ఆండ్రో బిత్తరపోయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. భార్య సంధ్యా అక్రమ సంబందం విషయం జాన్సన్ కు తెలిసిందని, తనను వదిలేసి రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నదని కోపంతో జాన్సన్ అతని భార్యను చంపేసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.