Paramour: మాయలేడి, నలుగురు భర్తలు, ఐదో ప్రియుడితో రొమాన్స్, క్లైమాక్స్ లో అడవిలో ?
అజ్మీర్/ రాజస్థాన్: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న యువతి కొంతకాలం ఆమె భర్తతో కాపురం చేసింది. భర్తకు విడాకులు ఇచ్చిన భార్య మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. రెండో భర్తతో కొంతకాలం కాపురం చేసిన మహిళ అతనితో విడిపోయి మూడోసారి పెళ్లి చేసుకుంది. మూడో భర్తతో కొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేసిన మహిళ అతనికి విడాకులు ఇచ్చి నాలుగో వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనితో కలిసి జీవిస్తోంది. అయితే మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా ఆమె మాత్రం ఎవ్వరిమాట వినలేదు. నాలుగో భర్తతో కలిసి జీవిస్తున్న మహిళ మరో ప్రియుడిని సెట్ చేసుకుంది. ఇంతమందితో రొమాన్స్ చేసిన కిలాడీ లేడీ అటవి ప్రాంతంలో శవమై కనిపించడం కలకలం రేపింది.

మొదటి భర్తకు విడాకులు
రాజస్థాన్ లోని అజ్మీర్లో శాంతాదేవి అలియాస్ దేవి అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న శాంతాదేవి కొన్ని సంవత్సరాలు ఆమె భర్తతో కాపురం చేసింది. భర్తతో కాపురం చేస్తున్న శాంతాదేవికి మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రియుడి మోజులో పడిన శాంతాదేవి ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది.

వరుసగా ముగ్గురు మోనగాళ్లు
కట్టుకున్న భర్తకు విడాకులు ఇచ్చిన శాంతాదేవి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. రెండో భర్తతో శాంతాదేవి కొన్ని సంవత్సరాలు కాపురం చేసింది. తరువాత రెండో భర్తకు విడాకులు ఇచ్చిన శాంతాదేవి ముచ్చటగా మరో వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. మూడో భర్తతో కొంతకాలం కాపురం చేసిన శాంతాదేవి తరువాత అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది.

నాలుగో భర్తతో కాపురం... ఐదో ప్రియుడు ఎంట్రీ
ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చిన శాంతాదేవి తరువాత సేతుసింగ్ అనే వ్యక్తిని నాలుగో పెళ్లింది. సంవత్సరం క్రితం సేతుసింగ్ ను పెళ్లి చేసుకున్న శాంతాదేవి అజ్మీర్ లో కాపురం పెట్టింది. సేతుసింగ్ మేస్త్రీ పని చేస్తున్న. పగలు మొత్తం భర్త సేతుసింగ్ బయట ఉండటంతో ఇంట్లో ఖాళీగా ఉన్న శాంతాదేవి మరో యువకుడితో పరిచయం పెంచుకుంది.

ఐదో ప్రియుడిని సెట్ చేసుకున్న కిలాడి
గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా శాంతాదేవి మాత్రం ఎవ్వరిమాట వినలేదు. నాలుగో భర్త సేతుసింగ్ తో కలిసి అజ్మీర్ లో జీవిస్తున్న శాంతాదేవి ఐదు నెలల క్రితం పరిచయం అయిన యువకుడితో రొమాన్స్ చేస్తోంది. తన భార్య శాంతాదేవి అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఆమె నాలుగో భర్త సేతుసింగ్ రగిలిపోయాడు.

నాలుగో భర్త చేతిలో ఫినిష్
నువ్వు పద్దతి మార్చుకోవాలని శాంతాదేవికి ఆమె నాలుగో భర్త సేతుసింగ్ హెచ్చరించాడు, అయితే శాంతాదేవి మాత్రం పద్దతి మార్చుకోకుండా ఐదో ప్రియుడితో రొమాన్స్ చేసింది. శాంతాదేవిని నమ్మించిన సేతుసింగ్ అతని స్నేహితుడు ఖేమ్ సింగ్ ఆటోలో పిలుచుకుని వెళ్లి ఆజ్మీర్ జిల్లాలోని దియోఘర్ పుష్పక్ అటవి ప్రాంతంలో చంపేశాడు.

ఐదో ప్రియుడి మోజులో ?
ఆటో డ్రైవర్ ఖేమ్ సింగ్, అతని ప్రియురాలు రేణు, నాలుగో మొగుడు సేతుసింగ్ కలిసి శాంతాదేవి శవాన్ని అటవి ప్రాంతంలో విసిరేసి పారిపోయారు, నాలుగు రోజుల తరువాత శాంతాదేవి హత్య కేసులో ఆమె నాలుగో భర్త సేతుసింగ్, ఆటో డ్రైవర్ ఖేమ్ సింగ్, అతని గర్ల్ ఫ్రెండ్ రేణును పోలీసులు అరెస్టు చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications