Illegal affair: మామతో భార్య మస్త్ మజా, బెడ్ రూమ్ లో చూసిన మొగుడు ఫినిష్, కిలాడి!
బెంగళూరు/తుంగభద్రా: భర్తతో కాపురం చేస్తున్న మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో కాపురం చేస్తూనే వరుసకు మామ అయ్యే వ్యక్తితో భార్య మస్త్ మజా చేస్తూ వచ్చింది. పెళ్లాం, మామ ఆడిందిఆటగా పాడిందిపాటగా తయారైయ్యింది. ఓ సారి బెడ్ రూమ్ లో మామా, పెళ్లాం రాసలీలలను చూసిన భర్త మండిపడ్డాడు. తాను మామతో ఎంజాయ్ చెయ్యాలంటే కచ్చితంగా మొగుడిని చంపేయాలని భార్య డిసైడ్ అయ్యింది. పక్క రాష్ట్రం నుంచి కిరాయి ఇచ్చి పిలిపించుకున్న భార్య పక్కాప్లాన్ తో మద్యం మత్తులో ఉన్న మొగుడిని చంపించి ఇప్పుడు అడ్డంగా బుక్కైపోయింది.

కేబుల్ ఆపరేటర్ ఫ్యామిలీ
కర్ణాటకలోని హోసపేట జిల్లా (విజయనగరం జిల్లా) తుంగభద్రా డ్యామ్ (టీబీ డ్యామ్)లోని పీఎల్ సీ కాలనీలో కేబుల్ ఆపరేటర్ మైకెల్ జాన్ (42), సుగుర్ణం (40) దంపతులు నివాసం ఉంటున్నారు. మైకెల్ జాన్, సుగుర్ణం దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేబుల్ ఆపరేటర్ అయిన మైకెల్ జాన్ డబ్బు సంపాధిస్తూ రోజు మద్యం సేవిస్తున్నాడు.

మామతో అక్రమ సంబంధం
మైకల్ జాన్ భార్య సుగుర్ణంకు వరుసకు మామ అయ్యే తమిళనాడులోని వినోద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. భర్త మైకెల్ జాన్ లేని సమయంలో భార్య సుగుర్ణం తమిళనాడులో ఉంటున్న ప్రియుడు వినోద్ ను ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేస్తోంది. భార్య సుగుర్ణం, మామ వినోద్ వ్యవహారం చాలాకాలం నుంచి గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుంది.

మొగుడికి మందు.... పెళ్లానికి విందుపొందు
మైకెల్ జాన్ డబ్బులు సంపాధిస్తూ రోజు మద్యం సేవిస్తున్నాడు. మద్యం మత్తులో ఊగిపోతున్న భర్తను పట్టించుకోకుండా భార్య సుగుర్ణం మామ వినోద్ తో కలిసి విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ విందుపొందు అంటూ ఆడింది. ఓ సారి బెడ్ రూమ్ లో భార్య సుగుర్ణం, ఆమె మామ వినోద్ మంచి మూడ్ లో రెచ్చిపోతున్న సమయంలో భర్త మైకెల్ జాన్ ఎంట్రీ ఇచ్చాడు. అంతే భార్యను నగ్నంగా మరో వ్యక్తితో చూసిన మైకెల్ భార్యను పట్టుకుని చితకబాదేశాడు.

నా మొగుడిని చంపేద్దాం.... సరేనా
తన భర్త అడ్డుగా ఉంటే వినోద్ తో ఎంజాయ్ చెయ్యలేమని భార్య సుగుర్ణం ఆలోచించింది. నా మొగుడిని చంపేస్తే మనం సుఖంగా ఉంటామని, నేను తమిళనాడు వచ్చేస్తానని, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలని భార్య సుగుర్ణం ఆమె ప్రియుడు వినోద్ కు చెప్పింది. వినోద్, సుగుర్ణం స్కెచ్ వేసి తమిళనాడు నుంచి అశోక్ అనే వ్యక్తిని పిలిపించారు.

దెబ్బకు మొగుడు ఫినిష్
గత నెల 20వ తేదీ రాత్రి టీబీ డ్యామ్ సమీపంలోని రైల్వేట్రాక్ పక్కన కుర్చుని మైకెల్ జాన్ మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో వినోద్, అశోక్ అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకుని చితకబాదేశారు. మద్యం మత్తులో ఉన్న మైకెల్ వాళ్లను ఏమీ చెయ్యలేకపోయాడు. కిందపడిపోయిన మైకెల్ తల మీద బండరాళ్లు వేసి అతిదారుణంగా హత్య చేసిన వినోద్, అశోక్ శవాన్ని విసిరేసి అక్కడి నుంచి పరారైనారు.

పెళ్లాం భలే చిక్కింది
మరుసటి రోజు మైకెల్ శవాన్ని చూసిన స్థానికులు టీబీ డ్యామ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. భర్త చనిపోయాడనే ఏమాత్రం దిగులు లేకుండా సుగుర్ణం ఆమె మేనమామ వినోద్ తో ఎంజాయ్ చేస్తోందని, గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతోందని తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

కిలాడి పెళ్లాం అందర్
తన మామ వినోద్, అతని స్నేహితుడు అశోక్ తో కలిసి తన భర్త మైకెల్ ను చంపించానని సుగుర్ణం పోలీసుల విచారణలో అంగీకరించింది. మైకెల్ హత్య కేసులో అతని భార్య సుగుర్ణం, ఆమె ప్రియుడు వినోద్, తమిళనాడుకు చెందిన అశోక్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications