Illegal affair: భర్త మీద కేసు పెట్టి పోలీసుతో జల్సా, క్యాష్ సెటిల్మెంట్, హోటల్ లో, ట్విస్ట్!
అహమ్మదాబాద్: భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న మహిళ కాపురంలో గొడవలు మొదలైనాయి. మొగుడు, పెళ్లాల పంచాయితీలు చేసిన పెద్ద మనుషులు విసిగిపోయి వారిని వదిలేశారు. చివరికి తన భర్త వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడని భార్య పోలీసు కేసు పెట్టింది. భర్త మీద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లేడీకి ఓ పోలీసు పరిచయం అయ్యాడు.
భర్త మీద కేసు పెట్టడానికి వెళ్లిన మహిళతో ఆ పోలీసు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చివరికి తన మీద ఓ హోటల్ లో పోలీసు రేప్ చేశాడని ఆమె ప్రియుడి మీద కేసు పెట్టడంతో కథ అనేక మలుపు తిరిగింది. వేరే వాడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న పోలీసులకు దూలతీరిపోయింది.
Cheating: మొగ్గురు మొగుళ్లు, పార్ట్ టైమ్ మాజీ మంత్రి, లెక్కలేనంత మందితో డీల్ ? కిలాడీ లేడి !
హ్యాపీలైఫ్ లో చిచ్చు
గుజరాత్ లోని అహమ్మదాబాద్ సమీపంలో రంజిత్, రమ్య శ్రీ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. రమ్యశ్రీకి 38 సంవత్సరాలు. వివాహం జరిగిన తరువాత కొన్ని సంవత్సరాలు రంజిత్, రమ్యశ్రీ హ్యాపీగా కాపురం చేశారు. నాలుగు సంవత్సరాల క్రితం రమ్యశ్రీ, రంజిత్ కాపురంలో చిచ్చు మొదలైయ్యింది.
భర్త మీద వరకట్నం వేధింపుల కేసు
రంజిత్, రమ్యశ్రీలు పదేపదే గొడవలు పడ్డారు. పుట్టింటి వాళ్లు, అత్తారింటి వాళ్లు పంచాయితీలు చేశారు. మొగుడు, పెళ్లాల పంచాయితీలు చేసిన పెద్ద మనుషులు విసిగిపోయి వారిని వదిలేశారు. ఎంత మంది పంచాయితీలు చేసినా రమ్యశ్రీ, రంజిత్ కాపురం చక్కబడలేదు. మూడు సంవత్సరాల క్రితం రమ్యశ్రీ ఆమె భర్త రంజిత్ మీద వరకట్నం వేధింపుల కేసు పెట్టింది.
పోలీసు ప్రియుడు
భర్త రంజిత్ మీద పోలీసు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న సమయంలో రాజారామ్ (పేరు మార్చడం జరిగింది) అనే కానిస్టేబుల్ రమ్యశ్రీకి పరిచయం అయ్యాడు. రానురాను రమ్యశ్రీ, రాజారామ్ దగ్గర అయ్యారు. భర్తకు దూరంగా ఉంటున్న రమ్యశ్రీతో కానిస్టేబుల్ రాజారామ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
మస్త్ మజా చేసిన పోలీసు
రమ్యశ్రీ ఫిగర్ అదిరిపోవడం, ఆమె చూడటానికి ఎర్రగా, బుర్రగా, బలంగా ఉండటంతో ఆమెతో కానిస్టేబుల్ రాజారామ్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. మూడు సంవత్సరాల నుంచి రమ్యశ్రీ, రాజారామ్ మస్త్ మజా చేశారు. కొంతకాలం క్రితం రమ్యశ్రీతో ఆమె పోలీసు ప్రియుడు రాజారామ్ కు వ్యవహారం బెడిసికొట్టింది. కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం సాగిస్తున్న రమ్యశ్రీ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి మీద రగిలిపోయింది.
ప్రియుడి మీద కేసు పెట్టిన లేడి
రమ్యశ్రీ, కానిస్టేబుల్ రాజారామ్ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. భర్తకు దూరం అయిన తనను వివాహం చేసుకుంటానని మూడు సంవత్సరాలు తనతో ఎంజాయ్ చేశాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నీకు దిక్కున్నచోట చెప్పుకో, నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ కానిస్టేబుల్ ఎదుతిరిగాడని ఆరోపిస్తూ కానిస్టేబుల్ ప్రియుడి మీద రమ్యశ్రీ పోలీసు కేసు పెట్టింది.
సెటిల్మెంట్ చేసిన పోలీసు పెద్దలు
రమ్యశ్రీ కేసు పెట్టడంతో సాటి పోలీసులు కానిస్టేబుల్ రాజారామ్ కు చివాట్లు పెట్టారు. కేసు నమోదు అయితే నీ ఉద్యోగం ఊడిపోతుందని, రమ్యశ్రీతో సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించారు. రాజీ పంచాయితీలు చేసిన పోలీసులు కానిస్టేబుల్ రాజారామ్ నుంచి కొంత డబ్బులు రమ్యశ్రీకి ఇప్పించి ఆ రోజు కేసు లేకుండా చేసేశారు.
హోటల్ లో రేప్ చేశాడని కేసు పెట్టిన ప్రియురాలు
పోలీసులు సెటిల్మెంట్ చేసిన తరువాత తనపాటికి తాను జీవనం సాగిస్తున్నానని, తరువాత నీతో మాట్లాడాలని తనను అహమ్మదాబాద్ కు పిలుచుకుని వెళ్లి ఓ హోటల్ లో తన మీద రాజారామ్ రేప్ చేశాడని, నా మీద కేసు పెట్టి నాదగ్గరే డబ్బులు వసూలు చేస్తావా అంటూ దాడి చేశాడని రమ్యశ్రీ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. రమ్యశ్రీ ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశామని పోలీసు అధికారులు చెప్పారని ది న్యూఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక కథనం ప్రచురించింది.