Illegal affair: రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, భర్తను చంపేసి కిచెన్ లో పాతిపెట్టి టైల్స్ వేసి!
ముంబాయి/చెన్నై: యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ చేసిన పనికి భర్త కుటుంబ సభ్యులతో పాటు కాలనీలో ఉంటున్న వాళ్లు, పోలీసులు షాక్ కు గురైనారు. ప్రియుడితో కలిసి భార్య బెడ్ రూమ్ లో నగ్నంగా ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో ఎంట్రీ ఇచ్చిన భర్త కత్తి తీసుకుని భార్యను, ఆమె ప్రియుడి మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. మన ఇద్దరు ప్రాణాలతో ఉండాలంటే నా మొగుడి ప్రాణం పోవాలని భార్య ఆమె ప్రియుడికి చెప్పింది. భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్త గొంతు కోసి చంపేశారు.
విషయం బయటకు తెలిస్తే సమస్యలు వస్తాయని భయపడిన భార్య ఆమె ప్రియుడి సహాయంతో భర్త శవాన్ని గోని సంచెలో మూటకట్టి వంట గదిలో గోతి తీసి పాతిపెట్టేసి పైన టైల్స్ తో కప్పేసింది. 12 రోజులు అదే వంట గదిలో వంట చేసుకుని హ్యాపీగా తింటున్న భార్య తన భర్త ఉద్యోగం పని మీద ఊరికి వెళ్లాడని అందర్నీ నమ్మించింది.

9 ఏళ్ల క్రితం పెళ్లి
దేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగరంలోని సౌత్ సబర్బ్ దషీర్ ప్రాంతంలోని రావల్ పాడ్ ఏరియాలోని ఖాన్ కాంపౌడ్ లో రాయిష్ షేక్ అనే యువకుడు నివాసం ఉంటున్నారు. 9 సంవత్సరాల క్రితం రాయిస్ షేక్ రషీదా షేక్ (28) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. రాయిస్ షేక్, రషీదా షేక్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భర్త సేల్స్ మెన్.... భార్య షేకింగ్ బిల్డప్
రయిస్ షేక్ ముంబయిలోని ఓ ప్రముఖ బట్టల షోరూమ్ లో సేల్స్ మెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి ఉద్యోగానికి వెలుతున్న భర్త రయిస్ షేక్ రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్లేవాడు. భర్త ఇంట్లో లేని సమయంలో శుభ్రంగా స్నానం చేసుకుని సింగారించుకుంటున్న రషీదా షేక్ టిప్ టాప్ గా రెఢీ అయ్యి ఇంటి గుమ్మం ముందు నిలబడి కుర్రాల ముందు ఫోజు కొట్టేదని తెలిసింది.

రషీదాను లైన్ లో పెట్టిన రసికుడు
సబర్బ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అమిత్ మిశ్రా అనే యువకుడు రషీదా షేక్ ఇంటి ముందు వెళ్లి వస్తూ ఆమెకు లైన్ వేశాడు. రాత్రి ఎప్పుడో భర్త ఇంటికి వస్తాడని, అంత వరకు నేను ఖాళీగా ఎందుకు ఉండాలని భావించిన రషీదా మెల్లిమెల్లిగా అమిత్ మిశ్రాకు సైగలు చేసింది. అంతే రషీదా, అమిత్ మిశ్రా ఒకరికి ఒకరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకోవడంతో అక్కడ కథ మలుపు తిరిగింది.

ఇంట్లో అయితే 100 % సేఫ్
రషీదా ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం తక్కువగా ఉండేదని తెలిసింది. రావల్ పాడ్ ఏరియాలో భర్త రాయిస్ షేక్ బంధువులు ఎక్కవడా ఉండటంతో తాను బయటకు వెళితే బంధువులు విషయం తెలుసుకుని తన భర్తకు సమాచారం ఇస్తారని, లేనిపోని సమస్యలు వస్తాయని రషీదా వెనకడుగు వేసింది.

బెడ్ రూమ్ లో దుకాణం పెట్టేసిన భార్య
ప్రియుడు అమిత్ మిశ్రా ఇంటికి వస్తే ఏ సమస్య ఉండదని భావించిన రషీదా అతన్ని ఇంటికి పిలిపించుకుని బెడ్ రూమ్ లో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. ప్రియురాలి పిల్లలు నిద్రపోతున్న సమయంలో, వాళ్లు బయట ఆడుకుంటున్న సమయంలో ఇంటికి వెలుతున్న అమిత్ మిశ్రా ప్రియురాలు రషీదాతో ఆమె బెడ్ రూమ్ లోనే మస్త్ మజా చేశాడు.

బెడ్ రూమ్ లో ప్రియుడితో నగ్నంగా భర్తకు చిక్కిన భార్య
12 రోజుల క్రితం బయటకు వెళ్లిన భర్త రాయిస్ షేక్ పని మద్యలో పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరాడు. భర్త బయటకు వెళ్లాడని, ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుందని ప్రియుడు అమిత్ మిశ్రాను ఇంటికి పిలిపించుకున్న రషీదా అతనితో బెడ్ రూమ్ లో నగ్నంగా ఎంజాయ్ చేస్తోంది.
ఒక్కసారిగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన భర్త రాయిస్ షేక్ భార్య రషీదా నగ్నంగా ప్రియుడు అమిత్ మిశ్రాతో బెడ్ రూమ్ లో ఉన్న విషయం గుర్తించి రగిలిపోయాడు. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంటే నువ్వు ఇలాంటి పాడు పని చేస్తావా అంటూ భర్త రాయిస్ షేక్ భార్ మీద రగిలిపోయాడు.

మొగుడు చస్తే చస్తాడు.... మన ప్రాణాలు మిగులుతాయి చంపేయ్
మీరు బతికితే నా పరువు పోతుందని, మిమ్మల్ని చంపేయాలని ఆవేశంగా ఊగిపోయిన రాయిస్ షేక్ వంట గదిలో ఉన్న కత్తి తీసుకుని భార్య రషీదా, ఆమె ప్రియుడు అమిత్ మిశ్రా మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. మనం ఇద్దరు బతికి తన భర్తను చంపేస్తే మనం హ్యాపీగా ఉంటామని భార్య రషీదా ప్రియుడిని రెచ్చగొట్టింది. రషీదా, ఆమె ప్రియుడు అమిత్ మిశ్రా కలిసి భర్త రాయిస్ చేతిలో ఉన్న కత్తి లాక్కొని అతని గొంతు కోసి దారుణంగా చంపేశారు.

కిచెన్ లో శవం పాతిపెట్టిన భార్య
రాయిస్ సేక్ ను చంపేసి శవాన్ని గోనే సంచిలో మూటకట్టి వంట గదిలో పాతిపెట్టేశారు. తరువాత వంట గదిలో టైల్స్ నీట్ గా పేర్చేసిన రషీదా 12 రోజుల నుంచి అక్కడే వంట చేసుకుని ఆమె తింటూ పిల్లలకు పెడుతూ వచ్చింది. మంగళవారం రాయిస్ షేక్ సోదరుడు ఇంటికి వెళ్లి తన తమ్ముడు ఎక్కడా అని ప్రశ్నించాడు. నీ తమ్ముడు టూర్ వెళ్లాడని రషీదా మాయమాటలు చెప్పింది. లాక్ డౌన్ టైమ్ లో టూర్ ఏమిటి ?, వంట గదిలో ఎందుకు మట్టి తవ్వారు, టైల్స్ ఎందుకు తీశారు అని అనుమానంతో రాయిస్ అన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కిలాడీ పెళ్లాం అరెస్టు..... కేటుగాడు ఎస్కేప్
వంట గదిలో తొవ్వి చూసిన పోలీసులు రాయిస్ షేక్ శవాన్ని చూసి షాక్ అయ్యారు. రషీదాను బెండ్ తీస్తే ఆమె స్టోరీ మొత్తం చెప్పేసింది. భర్తను దారుణంగా హత్య చేసిన రషీదా షేక్ ను అరెస్టు చేశామని, ఆమె ప్రియుడు అమిత్ మిశ్రా పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి వంట గదిలో పాతి పెట్టి 12 రోజులు భార్య నాటకాలు ఆడిందని వెలుగు చూడటంతో సబర్బన్ ప్రాంతంలో కలకలం రేపింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications