Illegal affair: ప్రియుడితో కలిసి పాలు స్కెచ్ తో భర్తను చంపేసింది, నెల తరువాత సీన్ రివర్స్ !
అహమ్మదాబాద్: భర్తతో కాపురం చేస్తున్న భార్య ఖతర్నాక్ లాంటి ప్రియుడిని సెట్ చేసుకుంది, భర్త బయటకు వెళ్లడం ఆలస్యం ప్రియుడు ఇంటికి వచ్చి భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త ఇంటికి వచ్చే సమయానికి ప్రియుడిని సైలెంట్ గా ఇంటి నుంచి పంపిస్తున్నది. ఇలా చాలాకాలం ప్రియుడితో ఆమె ఎంజాయ్ చేసింది. ప్రియుడితో కలిసి బయట తిరుగుతున్న సమయంలో ఆమె భర్త కంట్లో పడింది. తరువాత భార్యకు బెండ్ తీసిన భర్త ఆమెను కట్టడి చెయ్యడానికి ప్రయత్నించాడు. ప్రియుడి స్నేహితుడి భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఫ్రెండ్ భార్య సహాయంతో తన ప్రియురాలి భర్తను హత్య చెయ్యడానికి ప్రియుడు స్కెచ్ వేశాడు. అనుకున్నట్లు పక్కాప్లాన్ తో భర్తను చంపేశారు. తన భర్తకు గుండెపోటు వచ్చిందని 108 కు ఫోన్ చేసిన భార్య నాటకాలు ఆడింది. మరుసటి రోజు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని భర్త అంత్యక్రియలు జరిపించేసిన భార్య చేతులు దులుపుకునింది. అయితే తరువాత ఓ సిన్సియర్ పోలీసు అధికారి ఎంట్రీ ఇవ్వడంతో హత్యకు గురైన వ్యక్తి భార్య, ఆమె ప్రియుడి అసలు కథ మొదలైయ్యింది.

దంపతుల కాపురంలో
అహమ్మదాబాద్ లో బిపిన్ చంద్ర పటేల్, దీప్తి పటేల్ (35) దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త బిపిన్ చంద్రతో సంతోషంగా కాపురం చేస్తున్న దీప్తి పటేల్ తరువాత అడ్డదారి తొక్కింది. దీప్తి పటేల్ జీవితంలో సౌరభ్ సుతార్ అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. తరువాత దీప్తి పటేల్ సౌభర్ సతార్ ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

సైలెంట్ గా ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
భర్త బిపిన్ చంద్రాతో కాపురం చేస్తున్న అతని భార్య దీప్తి పటేల్ ఖతర్నాక్ లాంటి ప్రియుడు సౌరబ్ ను సైలెంట్ గా సెట్ చేసుకుంది, భర్త బిపిన్ చంద్రా బయటకు వెళ్లడం ఆలస్యం ప్రియుడు సౌరబ్ నేరుగా దీప్తి పటేల్ ఇంటికి వచ్చి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త బిపిన్ చంద్రా ఇంటికి వచ్చే సమయానికి దీప్తి పటేల్ ఆమె ప్రియుడు సౌరబ్ ను సైలెంట్ గా ఇంటి నుంచి పంపిస్తున్నది. ఇలా చాలాకాలం ప్రియుడు సౌరబ్ తో దీప్తి పటేల్ ఎంజాయ్ చేసింది.

బైక్ లో ప్రియుడితో తిరుగుతూ భర్తకు చిక్కిపోయింది
చాలా కాలం దీప్తి పటేల్, సౌరబ్ అక్రమ సంబంధం విషయం గుట్టుచప్పుడు కాకుండా సీక్రేట్ గా సాగిపోయింది. రానురాను దీప్తి పటేల్ ఆమె ప్రియుడు సౌరబ్ తో బయట తిరగడం మొదలుపెట్టింది. ప్రియుడు సౌరబ్ కలిసి బయట తిరుగుతున్న సమయంలో దీప్తి పటేల్ ఆమె భర్త బిపిన్ చంద్రా కంట్లో పడింది. తరువాత దీప్తి పటేట్ కు బెండ్ తీసిన భర్త బిపిన్ చంద్రా ఆమెను కట్టడి చెయ్యడానికి ప్రయత్నించాడు.

పాలు, నిద్రమాత్రల స్కెచ్ తో భర్త హత్యకు స్కెచ్
దీప్తి పటేల్ ను కలవడానికి వీలు కాకపోవడంతో సౌరబ్ ఆమె భర్త బిపిన్ ను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. సౌరబ్ తో పాటు ఉద్యోగం చేస్తున్న అతని స్నేహితుడు జతిన్ పాండ్యా అహమ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. స్నేహితుడు జతిన్ పాండ్యా భార్య సహాయంతో సౌరబ్ కొన్ని నిద్రమాత్రలు సేకరించాడు. నిద్రమాత్రలను ప్రియురాలు దీప్తి పటేల్ కు ఇచ్చిన సౌరబ్ ఆమె భర్తను చంపేయాలని చెప్పాడు.

ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భర్త
ఆగస్టు 19వ తేదీన రాత్రి భర్త బిపిన్ చంద్రాకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన దీప్తీ పటేల్ అతని పాలు తాగే వరకు ఆతనితో ప్రేమగా నటించింది. నిద్రమాత్రలు కలిపిన పాలు తాగిన బిపిన్ చంద్రా నిద్రలోకి జారుకున్నాడు. అర్దరాత్రి ప్రియుడు సౌరబ్ ను ఇంటికి పిలిపించుకున్న దీప్తి పటేల్ తరువాత బెడ్ రూమ్ లో తలదిండు భర్త బిపిన్ చంద్రా ముఖం మీద అదిమిపెట్టి అతన్ని చంపేశారు. తరువాత 108కు ఫోన్ చేసిన దీప్తి పటేల్ తన భర్తకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడని నాటకాలు ఆడింది.

జైల్లో భార్య, ప్రియుడు
మరుసటి రోజు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని దీప్తి పటేట్ ఆమె భర్త బిపిన్ అంత్యక్రియలు జరిపించేసి చేతులు దులుపుకునింది. అయితే తరువాత ఓ సిన్సియర్ పోలీసు అధికారి ఎంట్రీ ఇవ్వడంతో దీప్తి పటేల్ వ్యహారం మొత్తం బయటకు వచ్చింది. భర్త బిపిన్ చనిపోయి నెల రోజులు కూడా కాకుండా దీప్తి పటేల్ ఆమె ప్రియుడు సౌరబ్ తో కలిసి జల్సా చెయ్యడం మొదలు పెట్టింది. భర్త బిపిన్ చంద్రా హత్య కేసులో శనివారం అతని భార్య దీప్తి, ఆమె ప్రియుడు సౌరబ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించడం కలకలం రేపింది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications