Illegal affair: ఆంటీ షేరింగ్ విషయంలో ఇద్దరు యువకులు ?, మాజీ ఫ్రెండ్స్ ను చంపేసి శవాన్ని ? స్కెచ్ !
బెంగళూరు/శివమొగ్గ: కొన్ని సంవత్సరాల క్రితం యువకులు ఇద్దరూ స్నేహితులు. తరువాత ఇద్దరు యువకులు ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. వివాహిత మహిళ ఒకరికి తెలీకుండా ఒకరితో సీక్రేట్ గా ఎంజాయ్ చేసింది. కొంతకాలం తరువాత ఇద్దరి మద్య ఆ ఆంటీ విషయంలో తేడాలు వచ్చాయి. ఇదే సమయంలో రెండు ప్రముఖ పార్టీల్లో ఇద్దరు యువకులు చేరారు. రాజకీయంగా ఇద్దరి మద్య గొడవలు మొదలైనాయి. పాతపక్షలు, రాజకీయ గొడవలతో పాటు ఒకే ఆంటీ షేరింగ్ విషయంలో ఇద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది. ఇద్దరు యువకుల మద్య ఆంటీ విషయంలో, రాజకీయంగా గొడవలు ఉన్నాయని ఊరు అందరికి తెలుసు. ఇదే సమయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైనాడు. యువకుడి హత్య కేసులో అతని ప్రత్యర్థిని పోలీసులు పట్టుకున్నారు. తన కారణంగా ఓ ప్రియుడు హత్యకు గురైనా ఏమీ తెలియనట్లు నంగనాచిలాగా ఆంటీ సైలెంట్ గా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉండటంతో ఊరి ప్రజలు షాక్ అయ్యారు.
గతంలో ఫ్రెండ్స్
కర్ణాటకలోని శిమొగ్గ జిల్లాలోని సోరబ తాలుకాలోని మన్మనే గ్రామంలో లేఖప్ప (36), క్రిష్ణప్ప (36) అనే ఇద్దరు నివాసం ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి లేఖప్ప, క్రిష్ణప్ప ఇద్దరూ కలిసి చదువుకున్నారు. క్రిష్ణప్పకు వివాహం అయ్యే వరకు క్రిష్ణప్ప, లేఖప్ప బాగానే కలిసిమెలసి ఉండేవారు. లేఖప్పకు ఇంకా పెళ్లి కాలేదు. తరువాత రానురాను క్రిష్ణప్ప, లేఖప్ప మద్య తేడాలు వచ్చాయి.
ఒకే ఆంటీని తగులుకున్న మాజీ స్నేహితులు
చిన్నప్పటి నుంచి కలసిమెలసి తిరిగి, కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయిన క్రిష్ణప్ప, లేఖప్ప తరువాత ఇద్దరూ ఓ వివాహిత మహిళ సుధా (పేరు మార్చడం జరిగింది)తో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. వివాహిత మహిళ సుధా కూడా క్రిష్ణప్ప, లేఖప్ప ఒకేసారి ఇంటికి రాకుండా చూసుకుని ఒకరికి తెలీకుండా ఒకరితో సీక్రేట్ గా ఎంజాయ్ చేసింది.
ఒకేసారీ ఆంటీ ఇంట్లో ?...... ఆంటీ షేరింగ్ విషయంలో
కొంతకాలం తరువాత సుధా ఆంటీ విషయంలో క్రిష్ణప్ప, లేఖప్పల మద్య మళ్లీ తేడాలు వచ్చాయి. గత ఏడాది క్రిష్ణప్ప ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో లేఖప్ప ఆమె ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ లేఖప్ప, క్రిష్ణప్ప మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఆ సమయంలో సుధా ఆంటీ ఇద్దరిని నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించేసింది.
రాజకీయ గొడవలు.... ఆంటీ విషయంలో ?
ఇదే సమయంలో రెండు ప్రముఖ పార్టీల్లో క్రిష్ణప్ప, లేఖప్ప చేరారు. రాజకీయంగా లేఖప్ప, క్రిష్ణప్పల మద్య గొడవలు మొదలైనాయి. పాతపక్షలు, రాజకీయ గొడవలతో పాటు సుధా ఆంటీ షేరింగ్ విషయంలో ఇద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది. ఆంటీ విషయంలో, రాజకీయంగా క్రిష్ణప్ప, లేఖప్పల మద్య గొడవలు ఉన్నాయని ఊర్లో అందరికి తెలుసు.
పొలంలో పని ఉందని వెళ్లి మాయం
ఏప్రిల్ 11వ తేదీన పొలంలో పని చేసుకుని వస్తానని లేఖప్ప ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. రెండు రోజులు అయినా లేఖప్ప ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు సోరబ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పోలీసులు లేఖప్ప కనపడటం లేదని మిస్సింగ్ కేసు పెట్టి విచారణ మొదలుపెట్టారు. ఇదే సమయంలో తమకు క్రిష్ణప్ప మీద అనుమానం ఉందని లేఖప్ప కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పెళ్లి కూతురిని సెట్ చేస్తామని పిలిపించి హత్య
లేఖప్పకు పెళ్లి కూతురిని చూపిస్తామని ఓ వ్యక్తి ద్వారా సమాచారం పంపించిన క్రిష్ణప్ప అతన్ని ఏప్రిల్ 11వ తేదీన ఓ ఇంటికి పిలిపించారు. అదే రోజు లేఖప్ప గొంతును టవల్ తో బిగించి చంపేశారు. అదే రోజు రాత్రి లేఖప్ప శవాన్ని గోనె సంచిలో మూటకట్టేసిన క్రిష్ణప్ప అతని స్నేహితుడు శవం మాయం చెయ్యాలని స్కెచ్ వేశారు.
బైక్ లో శవాన్ని ఎత్తుకెళ్లిన కిలాడి క్రిష్ణప్ప
లేఖప్ప శవం ఉన్న గోనె సంచిని బైక్ లో పెట్టుకుని వెళ్లి శివమొగ్గ సమీపంలో నదీ కాలువలో విసిరేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. లేఖప్పను తానే హత్య చేశానని క్రిష్ణప్ప అంగీకరించడాని, అతన్ని అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నామని శివమొగ్గ జిల్లా ఎస్పీ ఎంబీ. లక్ష్మీప్రసాద్ మీడియాకు చెప్పారు. తన కారణంగా ప్రియుడు లేఖప్ప హత్యకు గురైనా ఏమీ తెలియనట్లు నంగనాచిలాగా ఆంటీ సైలెంట్ గా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉండటంతో ఊరి ప్రజలు షాక్ అయ్యారు.