అరుదైన ఫీట్- భూమికి 30 కి.మీ పైన జెండా ఆవిష్కరణ-అంతరిక్షం నుంచి శుభాకాంక్షలు
మన దేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా భారతదేశంలోనే కాదు, త్రివర్ణ పతాకాల రంగులు అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. దేశంలో వాడవాడలా పతాకావిష్కరణలు సాగుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు అంతరిక్షంలోనూ ఇదే ఫీట్ సాకారమైంది.
దేశం కోసం యువ శాస్త్రవేత్తలను సృష్టించే అంతరిక్ష సంస్థ అయిన స్పేస్ కిడ్స్ ఇండియా ఇవాళ ఓ అరుదైన వీడియోను షేర్ చేసింది. ఇందులో భారత జాతీయ పతాకాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భూమికి 30 కిలోమీటర్లు పైన ఆవిష్కరించారు. ఇది ప్రత్యేక నానో-శాటిలైట్ లాంచ్ వెహికల్ (NSLV)-బెలూన్ లాంచ్ గా పేర్కొన్నారు. అంతరిక్షానికి 30 కిమీ సమీపంలో ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.
ఇస్రో చిన్న ఉపగ్రహాలలాంచ్ వెహికల్ ఒక వారం క్రితం తన తొలి విమానాన్ని తీసుకున్నప్పుడు ఇటీవల స్పేస్ కిడ్స్ ఇండియా వార్తల్లో నిలిచింది. స్పేస్ కిడ్స్ ఇండియాతో అనుసంధానించిన 750 మంది బాలికలు తాము రూపొందించిన ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ప్రయోగం విజయవంతం కాలేదు. ఇదిలా ఉండగా, భారతదేశం @ 75 ఏళ్ల స్వాతంత్రం పూర్తి చేసుకున్న గుర్తుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి శుభాకాంక్షల వీడియోను ఇస్రో ఇప్పటికే ట్వీట్ చేసింది.
On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s home town of Hyderabad shines bright. @nasa is just 1 place Indian Americans make a difference every day. Looking forward to @IndianEmbassyUS celebration pic.twitter.com/4eXWHd49q6
— Raja Chari (@Astro_Raja) August 14, 2022
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి స్వాతంత్ర దినోత్సవ వేళ భారతదేశాన్ని అభినందిస్తూ సందేశం పంపారు. దశాబ్దాలుగా అనేక అంతర్జాతీయ సంస్థలు అనేక అంతరిక్ష యాత్రల కోసం భారతదేశంతో కలిసి పనిచేశాయి. ఆ సహకారం నేటికీ కొనసాగుతుందని ఆమె తెలిపారు. వాతావరణ మార్పులపై మంచి అవగాహన కల్పించడానికి సాయం చేసే ఎర్త్ సైన్స్ మిషన్ గురించి ప్రస్తావిస్తూ... భారతీయ-అమెరికన్ వ్యోమగామి రాజా చారి అభినందన సందేశంతో అంతరిక్ష సంస్థ మరో వీడియోను కూడా షేర్ చేసింది.
ఒక ప్రత్యేక ట్వీట్లో, భారతీయ-అమెరికన్ వ్యోమగామి రాజా జారి కొన్ని చిత్రాలతో పాటు ఇలా రాశారు. "భారత స్వాతంత్ర్య సందర్భంగా నా వలస తండ్రి స్వస్థలమైన హైదరాబాద్ ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్న @Space_Station నుండి నేను చూడగలిగిన భారతీయ డయాస్పోరా గురించి నాకు గుర్తుకు వచ్చింది. @ నాసా కేవలం ప్రదేశం భారతీయ అమెరికన్లు ప్రతిరోజు ఒక మార్పును చూపుతుంది. @IndianEmbassyUS వేడుక (sic) కోసం ఎదురుచూస్తున్నాము." అంటూఆయన పేర్కొన్నారు. దీనికి యూఎస్ లోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంద్ఘూ స్పందిస్తూ.. "అంతరిక్షంలో తిరంగా ఇండియా.. నిజానికి భారతీయ డయాస్పోరా భారతదేశం-యుఎస్ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన లింక్" అని బదులిచ్చారు.