ఆగష్టు 15,1947 బ్రిటీష్ పాలకుల నుంచి భరతమాతకు విముక్తి కలిగిన రోజు. ఎంతో మంది త్యాగాల ఫలితమే భారత స్వాతంత్య్రం. 2023 ఆగష్టు 15న యావత్ భారతదేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతాయి. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ఇతివృత్తం "దేశం ముందు..ఎప్పుడూ ముందు". ఈ ఇతివృత్తం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ సమగ్రత మరియు దేశ అభివృద్ధిని సూచిస్తుంది.
ఆగష్టు 15వ తేదీ ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు. అనంతరం మిలటరీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.77వ స్వాతంత్ర్య దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటోంది దేశం. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారత్ అన్ని కీలక రంగాల్లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఏపీలో సీఎం జగన్ మువ్వన్నెల జెండా ఎగురవేస్తారు. చారిత్రాత్మక గోల్కొండ కోటపై తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు.
ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లైవ్ అప్డేట్స్ మీకోసం
Aug 15, 2023, 11:19 am IST
దివ్యాంగుల పెన్షన్ రూ. 4 వేలకు పెంచినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
Aug 15, 2023, 11:11 am IST
భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలను కాపాడినట్లు కేసీఆర్ తెలిపారు.
Aug 15, 2023, 11:05 am IST
తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.
Aug 15, 2023, 10:52 am IST
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్.
Aug 15, 2023, 10:50 am IST
గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.
Aug 15, 2023, 10:47 am IST
గోల్కొండ కోటకు చేరుకున్న సీఎం కేసీఆర్.
Aug 15, 2023, 10:31 am IST
ఎటువంటి లాంచలు లేకుండా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు జగన్ తెలిపారు.
Aug 15, 2023, 10:27 am IST
15 వేల మంది మహిళ పోలీసులను నియమించినట్లు సీఎం జగన్ చెప్పారు.
Aug 15, 2023, 10:26 am IST
దిశ యాప్, దిశ పోలీస్టేషన్లు నెలకొల్పినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
Aug 15, 2023, 10:25 am IST
కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ద్వారా మహిళలకు చేయూత అందిస్తున్నామని జగన్ వివరించారు.
Aug 15, 2023, 10:24 am IST
పొదుపు సంఘాలు దేశంలో అగ్రగామిగా నిలిచాయని జగన్ తెలిపారు.
Aug 15, 2023, 10:22 am IST
మహిళల కోసం అనే పథకాలు తీసుకొచ్చినట్లు జగన్ చెప్పారు.
Aug 15, 2023, 10:21 am IST
దేశంలో ఎక్కడి లేని విధంగా ఆరోగ్య అసరా అమలు చేస్తున్న ఏకకై రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని జగన్ వివరించారు.
Aug 15, 2023, 10:20 am IST
ప్రతి మండలానికి రెండు పీహెచ్ సీయూలు ఏర్పాటు చేశామని సీఎం జగన్ చెప్పారు.
Aug 15, 2023, 10:17 am IST
స్పెషల్ రిక్రూట్ మెంట్ ద్వారా అనేక మంది స్పషలైజేషన్ వైద్యులను తీసుకున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
Aug 15, 2023, 10:16 am IST
ప్రతి మండలానికి 104, 108 అంబులెన్సులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.
Aug 15, 2023, 10:15 am IST
17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు జగన్ చెప్పారు.
Aug 15, 2023, 10:15 am IST
విద్యారంగంలో సమూల మార్పులు చేస్తున్నట్లు జగన్ చెప్పారు.
Aug 15, 2023, 10:13 am IST
విదేశీ విద్యాదీవేన ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అని జగన్ అన్నారు.
Aug 15, 2023, 10:09 am IST
నాడు నేడు ద్వారా 45 పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నట్లు జగన్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
Aug 15, 2023, 10:07 am IST
పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని జగన్ స్పష్టం చేశారు.
Aug 15, 2023, 10:07 am IST
వెలుగొండ రెండు టన్నెల్ పనులు రెండు నెలల్లో పూర్తి కానున్నాయని సీఎం చెప్పారు.
Aug 15, 2023, 10:06 am IST
ప్రాజెక్టులన్నీ పూర్తి చేశామని జగన్ అన్నారు.
Aug 15, 2023, 10:03 am IST
భూ వివాదాలు లేకుండా సర్వే చేసి రికార్డులు భద్రపరిచామని జగన్ తెలిపారు.
Aug 15, 2023, 10:00 am IST
52 లక్షల మంది రైతులకు సంవత్సరానికి 13 వేలు అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.
Aug 15, 2023, 9:58 am IST
99 శాతం హామీలు అమలు చేశామని జగన్ చెప్పారు.
Aug 15, 2023, 9:57 am IST
పేదలను ధనికులుగా మార్చడమే తమ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు.
రేపు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్న ప్రధాని మోదీ
5:22 PM, 14 Aug
తెలుగు రాష్ట్రాల్లో జాతీయ జెండాను ఎగురవేయనున్న సీఎం జగన్, సీఎం కేసీఆర్
5:24 PM, 14 Aug
77వ స్వాతంత్య్ర దినోత్సవ ఇతివృత్తం దేశం ముందు, ఎప్పటికీ ముందు
5:25 PM, 14 Aug
మరి కాసేపట్లో దేశప్రజలనుద్దేశించి స్వాతంత్య్ర సందేశం ఇవ్వనున్న రాష్ట్రపతి ముర్ము
7:09 PM, 14 Aug
ఢిల్లీ
77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తోన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
My heartiest greetings to all on our 77th Independence Day. It is a glorious and auspicious occasion for all of us. I am overjoyed to see that festivity is in the air. It is a matter of delight as well as pride for us to see how everyone – children, youth and the elderly, in… pic.twitter.com/Chn0EK3Rg1
పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా యావత్ దేశ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను జరుపుకొంటున్నారు- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
7:16 PM, 14 Aug
ఢిల్లీ
దాస్య శృంఖలాల నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి బలిదానాలు, ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను దేశ ప్రజలు గౌరవించుకుంటోన్నారు. వారి త్యాగాల వల్లే దేశం స్వాతంత్ర్యాన్ని పొందగలిగింది- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
7:19 PM, 14 Aug
ఢిల్లీ
మాతంగిని హజ్రా, కనక్లత బారువా వంటి ఎందరో మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులు.. భరతమాత కోసం తమ ప్రాణాలను అర్పించారు- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
7:22 PM, 14 Aug
ఢిల్లీ
కీర్తి చక్ర, శౌర్య చక్ర వంటి అవార్డుల కోసం ఎంపిక చేసిన వారి జాబితాను విడుదల చేసిన రాష్ట్రపతి భవన్. కొద్దిసేపటి కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై సంతకం చేశారు.
President Droupadi Murmu has approved 76 Gallantry awards to Armed Forces and Central Armed Police Forces personnel on the eve of Independence Day 2023. These include four Kirti Chakra (posthumous), 11 Shaurya Chakras, including five posthumous, two Bar to Sena Medals… pic.twitter.com/fFjQbL3kPl
ప్రస్తుతం భారత్.. సరైన దిశలో ప్రయాణిస్తోంది. అంతర్జాతీయ దేశల స్థాయికి చేరుకుంటోది. ప్రపంచదేశాల చూపులను తనవైపునకు తిప్పుకొంటోంది. దీనికి నిదర్శనమే జీ20 సదస్సు నిర్వహణ- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
#WATCH | On the eve of Independence Day, President Droupadi Murmu says "Today, we see that India has not only regained its rightful place on the world stage, but it has also enhanced its standing in the international order. India is playing a crucial role in promoting… pic.twitter.com/yH2fwaJUbX
మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషాన్ని కలిగిస్తోంది. కుటుంబం, సమాజంలో మహిళల స్థానాన్ని ఇది బలోపేతం చేస్తుంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వండి. ధైర్యంగా అన్ని సవాళ్లను అధిగమించి జీవితంలో ముందుకు సాగేలా తోడ్పాటును అందించండి- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
7:40 PM, 14 Aug
ఢిల్లీ
జీ20 సమ్మిట్తో ప్రపంచ దేశాలకు భారత్.. ఓ దిశా నిర్దేశం చేయగలుగుతుంది. వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో సమానమైన పురోగతి వైపు ప్రపంచాన్ని నడిపించగలుగుతుంది- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
7:46 PM, 14 Aug
ఢిల్లీ
అన్ని రంగాల్లోనూ భారత్ గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. సమ్మిళిత అభివృద్ధి నమోదు చేస్తోంది- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
7:47 PM, 14 Aug
ఢిల్లీ
2020లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం వల్ల మార్పులు మొదలయ్యాయి. వాటి ఫలితాలను అందుకోబోతున్నాం. రాబోయే కాలంలో దేశంలో అనేక కొత్త మార్పులకు విద్యా విధానం శ్రీకారం చుడుతుంది- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
7:49 PM, 14 Aug
ఢిల్లీ
ప్రపంచంలో అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. తన తదుపరి లక్ష్యంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాల్సి ఉంది- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
7:50 PM, 14 Aug
ఢిల్లీ
గ్లోబల్ వార్మింగ్, కరవు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. అందుకే పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
7:51 PM, 14 Aug
ఢిల్లీ
స్టార్టప్ల నుంచి క్రీడల వరకు మనదేశ యువత జాతీయ, అంతర్జాతీయంగా దేశం గర్వించేలా కృషి చేస్తోన్నారు- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
7:53 PM, 14 Aug
ఢిల్లీ
దేశం సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంది. ఫలితంగా అధిక జీడీపీ రేటును నమోదు చేయగలిగాం. ఇందులో రైతులు కీలక పాత్రను పోషించారు- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
8:08 PM, 14 Aug
ఢిల్లీ
హర్ ఘర్ తిరంగాలో భాగంగా తన నివాసంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.
#WATCH | Delhi: Union Minister Anurag Thakur hoisted national flag at his residence ahead of Independence Day as part of ‘Har Ghar Tiranga’ campaign, earlier today. pic.twitter.com/axbZRsGuY5
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని మువ్వన్నెల విద్యుద్దీపాలతో అలంకరించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబైన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం. pic.twitter.com/ixMVgHL6Hb
77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధానిలో గల రాజ్ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ సమాధికి నివాళి అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ పురోభివృద్ధికి పునరంకితం అవుదామంటూ పిలుపు.
आप सभी को स्वतंत्रता दिवस की अनेकानेक शुभकामनाएं। आइए, इस ऐतिहासिक अवसर पर अमृतकाल में विकसित भारत के संकल्प को और सशक्त बनाएं। जय हिंद!
Best wishes on Independence Day. We pay homage to our great freedom fighters and reaffirm our commitment to fulfilling their vision. Jai Hind!