Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

77th Independence Day Celebrations LIVE:దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సంబురాలు..!

ఆగష్టు 15,1947 బ్రిటీష్ పాలకుల నుంచి భరతమాతకు విముక్తి కలిగిన రోజు. ఎంతో మంది త్యాగాల ఫలితమే భారత స్వాతంత్య్రం. 2023 ఆగష్టు 15న యావత్ భారతదేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతాయి. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ఇతివృత్తం "దేశం ముందు..ఎప్పుడూ ముందు". ఈ ఇతివృత్తం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ సమగ్రత మరియు దేశ అభివృద్ధిని సూచిస్తుంది.

ఆగష్టు 15వ తేదీ ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు. అనంతరం మిలటరీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.77వ స్వాతంత్ర్య దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటోంది దేశం. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారత్ అన్ని కీలక రంగాల్లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఏపీలో సీఎం జగన్ మువ్వన్నెల జెండా ఎగురవేస్తారు. చారిత్రాత్మక గోల్కొండ కోటపై తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు.

ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Independence Day 2023 LIVE News in Telugu

Aug 15, 2023, 11:19 am IST

దివ్యాంగుల పెన్షన్ రూ. 4 వేలకు పెంచినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
Aug 15, 2023, 11:11 am IST

భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలను కాపాడినట్లు కేసీఆర్ తెలిపారు.
Aug 15, 2023, 11:05 am IST

తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.
Aug 15, 2023, 10:52 am IST

పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్.
Aug 15, 2023, 10:50 am IST

గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.
Aug 15, 2023, 10:47 am IST

గోల్కొండ కోటకు చేరుకున్న సీఎం కేసీఆర్.
Aug 15, 2023, 10:31 am IST

ఎటువంటి లాంచలు లేకుండా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు జగన్ తెలిపారు.
Aug 15, 2023, 10:27 am IST

15 వేల మంది మహిళ పోలీసులను నియమించినట్లు సీఎం జగన్ చెప్పారు.
Aug 15, 2023, 10:26 am IST

దిశ యాప్, దిశ పోలీస్టేషన్లు నెలకొల్పినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
Aug 15, 2023, 10:25 am IST

కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ద్వారా మహిళలకు చేయూత అందిస్తున్నామని జగన్ వివరించారు.
Aug 15, 2023, 10:24 am IST

పొదుపు సంఘాలు దేశంలో అగ్రగామిగా నిలిచాయని జగన్ తెలిపారు.
Aug 15, 2023, 10:22 am IST

మహిళల కోసం అనే పథకాలు తీసుకొచ్చినట్లు జగన్ చెప్పారు.
Aug 15, 2023, 10:21 am IST

దేశంలో ఎక్కడి లేని విధంగా ఆరోగ్య అసరా అమలు చేస్తున్న ఏకకై రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని జగన్ వివరించారు.
Aug 15, 2023, 10:20 am IST

ప్రతి మండలానికి రెండు పీహెచ్ సీయూలు ఏర్పాటు చేశామని సీఎం జగన్ చెప్పారు.
Aug 15, 2023, 10:17 am IST

స్పెషల్ రిక్రూట్ మెంట్ ద్వారా అనేక మంది స్పషలైజేషన్ వైద్యులను తీసుకున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
Aug 15, 2023, 10:16 am IST

ప్రతి మండలానికి 104, 108 అంబులెన్సులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.
Aug 15, 2023, 10:15 am IST

17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు జగన్ చెప్పారు.
Aug 15, 2023, 10:15 am IST

విద్యారంగంలో సమూల మార్పులు చేస్తున్నట్లు జగన్ చెప్పారు.
Aug 15, 2023, 10:13 am IST

విదేశీ విద్యాదీవేన ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అని జగన్ అన్నారు.
Aug 15, 2023, 10:09 am IST

నాడు నేడు ద్వారా 45 పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నట్లు జగన్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
Aug 15, 2023, 10:07 am IST

పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని జగన్ స్పష్టం చేశారు.
Aug 15, 2023, 10:07 am IST

వెలుగొండ రెండు టన్నెల్ పనులు రెండు నెలల్లో పూర్తి కానున్నాయని సీఎం చెప్పారు.
Aug 15, 2023, 10:06 am IST

ప్రాజెక్టులన్నీ పూర్తి చేశామని జగన్ అన్నారు.
Aug 15, 2023, 10:03 am IST

భూ వివాదాలు లేకుండా సర్వే చేసి రికార్డులు భద్రపరిచామని జగన్ తెలిపారు.
Aug 15, 2023, 10:00 am IST

52 లక్షల మంది రైతులకు సంవత్సరానికి 13 వేలు అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.
Aug 15, 2023, 9:58 am IST

99 శాతం హామీలు అమలు చేశామని జగన్ చెప్పారు.
Aug 15, 2023, 9:57 am IST

పేదలను ధనికులుగా మార్చడమే తమ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు.
Aug 15, 2023, 9:50 am IST
ఆంధ్రప్రదేశ్

విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
Aug 15, 2023, 9:49 am IST
మధ్యప్రదేశ్

77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భోపాల్‌లోని తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.
Aug 15, 2023, 9:32 am IST
బీహార్

పాట్నాలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+