అసహనమంటూ: రైటర్స్పై తస్లీమా నస్రీన్ ఘాటుగా
న్యూఢిల్లీ: భారతదేశం... ఒక అసహన దేశమని, ఇక్కడ కొంతమంది అసహనవాదులు తిష్టవేసుకుని ఉన్నారని ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆదివారం కఠిన వ్యాఖ్యలు చేశారు. హిందూ ఛాందసవాదాన్ని, ముస్లిం విధానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు.
పశ్చిమ బెంగాల్లో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఉదంతాన్ని గుర్తు చేస్తూ... ప్రతీ సమాజంలోనూ కొంతమంది అసహనవాదులు ఉంటారని, అయితే వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు ప్రతీ ఒక్కరికీ హక్కు ఉందని చెప్పారు. భారత్లో రచయితలకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పారు.

విమర్శిస్తే అసహనమా: అన్సారీ
విమర్శించడం, ప్రశ్నించడాలపై సమాజంలో అసహనం కనిపిస్తోందనీ, ఆ కారణంవల్లనే కొందరిని దూరంగా పెట్టడం, హతమార్చడం వంటివి చోటు చేసుకుంటున్నాయని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వేరుగా ఢిల్లీలో అన్నారు. మన కుటుంబాల్లో కూడా ప్రశ్నించడాన్ని అంగీకరించలేమన్నారు. పిల్లలు ప్రశ్నిస్తే ఇంట్లో పెద్దలకు, బడిలో ఉపాధ్యాయులకూ కోపం వచ్చేస్తుందన్నారు.
హిందూ సంస్కృతే మన గుర్తింపు: భగవత్
హిందూ సంస్కృతే భారతదేశ గుర్తింపని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘ్చాలక్ మోహన్ భగవత్ బెంగళూరులో అన్నారు. అందుకే మన దేశానికి హిందూ దేశం అనే పేరొచ్చిందన్నారు. భారత్ అంటే ఏదో కొంత భూభాగం పేరు మాత్రమే కాదని అన్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications