హిందూ ఆలయాలపై యూకేలో దాడులు: తీవ్రంగా ఖండించిన భారత్, చర్యలకు డిమాండ్
న్యూఢిల్లీ : బ్రిటన్లోని లీసెస్టర్ నగరంలో భారతీయ సమాజంపై హింస, హిందువుల ప్రాంగణాలను ధ్వంసం చేయడాన్ని యునైటెడ్ కింగ్డమ్లోని భారత హైకమిషన్ ఖండించింది. ఈ దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.
హైకమిషన్ సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. యూకే అధికారులతో సమస్యను "గట్టిగా" లేవనెత్తినట్లు పేర్కొంది. స్థానిక పోలీసులచే "తీవ్రమైన రుగ్మత"గా వర్ణించి.. లీసెస్టర్లో వారాంతంలో జరిగిన ఘర్షణల నివేదికల తరువాత ప్రభావితమైన వారికి రక్షణ కల్పించాలని కూడా ఇది పిలుపునిచ్చింది.

"లీసెస్టర్లో భారతీయ సమాజంపై జరిగిన హింస, హిందూ మతం ప్రాంగణం, చిహ్నాలను ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము" అని హైకమిషన్ ప్రకటన స్పష్టం చేసింది.
Press Release: High Commission of India, London condemns the violence in Leicester. @MIB_India pic.twitter.com/acrW3kHsTl
— India in the UK (@HCI_London) September 19, 2022
ఆగస్టు 28న పాకిస్థాన్తో జరిగిన ఆసియా కప్ టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించిన తర్వాత హింసాకాండ మొదలైంది. ఈ ఘటన బెల్గ్రేవ్లోని మెల్టన్ రోడ్లో ఘర్షణకు దారితీసింది.
Muslims in Leicester hunt down Hindus as tensions rise between the two communities. MSM silent as always. pic.twitter.com/0HZXwNvuRu
— kazza mc (@sammijohnst) September 6, 2022
వారాంతంలో, హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన యువకులతో లీసెస్టర్లో హింస చెలరేగింది. బ్రిటీష్ మీడియా ప్రకారం.. హిందువులు, ముస్లింలు పెద్ద ఎత్తున గుమిగూడి దాడులకు దిగారని పేర్కొంది.
నివేదికల ప్రకారం, రెండు వర్గాల నుంచి అనేక వస్తువులు విసరడంతో హింస పెరగకుండా నిరోధించడానికి పోలీసులు రెండు వర్గాల మధ్య నిలబడ్డారు. శనివారం సాయంత్రం, లీసెస్టర్లోని మెల్టన్ రోడ్లోని హిందూ మతపరమైన భవనం వెలుపల ఒక వ్యక్తి జెండాను క్రిందికి లాగుతున్నట్లు వీడియో ప్రసారం చేసింది. ఆలయ జెండాను చింపివేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.
Gangs running riot and escalating attacks on Hindus. Innocent Hindus have been terrorized in their own properties, there have been attempts to stab and there has been rampant vandalism of Hindu properties. #Leicester pic.twitter.com/zWiyISy2hw
— Rashmi Samant (@RashmiDVS) September 7, 2022
ఈ దాడుల ఘటనలో ఎక్కువగా యువకులే పాల్గొన్నారని పోలీసలు తెలిపారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చి కూడా దాడులకు పాల్పడ్డారని యూకే పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు కనీసం 15 మందిని అరెస్టు చేసినట్లు ఏఎన్ఐ నివేదించింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో గణనీయమైన పోలీసు ఆపరేషన్ కొనసాగుతుందని బ్రిటన్ మీడియా వెల్లడించింది.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications