సరిహద్దులను తప్పుగా చూపిన సౌదీ అరేబియా: భారత తీవ్ర నిరసన
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా తమ దేశ బ్యాంక్ నోట్పై భారత సరిహద్దులను తప్పుగా చూపినందుకు ఆ దేశానికి భారత్ తీవ్ర నిరసన తెలిపింది. ఈ నోట్లో ఇండియా నుంచి జమ్మూకాశ్మీర్, లడఖ్ భూభాగాలను వేరు చేసి చూపారని, దాదాపు తొలగించారని విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి ఇవి ముమ్మాటికీ భారత అంతర్భాగాలని స్పష్టం చేసింది.
Recommended Video
ఈ బ్యాంక్ నోట్ని సౌదీ అరేబియన్ మానిటరీ అథారిటీ అక్టోబర్ 24న విడుదల చేసింది. దీన్ని వెంటనే సరిదిద్దాలని సౌదీని కోరినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, ఈ నోట్ లో పీవోకే, బల్టిస్థాన్ భూభాగాలను మొదట పాక్కు చెందినవిగా మ్యాప్ లో చూపి.. ఆ తర్వాత తొలగించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

జీ 20 గ్రూపుకు సౌదీ అరేబియా అధ్యక్ష పదవిని గుర్తుగా విడుదల చేసిన కొత్త 20 రియాల్ నోట్లో ముద్రించిన గ్లోబల్ మ్యాప్, భారతదేశంలో భాగంగా ఉన్న జమ్మూకాశ్మీర్, లడఖ్లను కలిగి లేదు. ఈ విషయంలో "అత్యవసర దిద్దుబాటు చర్యలు" తీసుకోవాలని భారతదేశం సౌదీ అరేబియాను కోరిందని, జమ్మూ కాశ్మీర్, లడఖ్ మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు భారత అంతర్భాగమని విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు.
'మీరు సూచించిన నోటును మేము చూశాం, ఇది భారతదేశం యొక్క బాహ్య ప్రాదేశిక సరిహద్దులను తప్పు వర్ణనను ఇస్తుంది. జీ 20 కి సౌదీ అధ్యక్ష పదవిని పురస్కరించుకుని అక్టోబర్ 24 న సౌదీ అరేబియా ద్రవ్య అథారిటీ ఈ నోట్ జారీ చేసింది' అని శ్రీవాస్తవ వారపు మీడియా సమావేశంలో అన్నారు.
'సౌదీ అరేబియా అధికారిక, చట్టపరమైన నోటుపై భారతదేశ బాహ్య ప్రాదేశిక సరిహద్దులను పూర్తిగా తప్పుగా చూపించినందుకు సౌదీ అరేబియాకు, న్యూల్లీలో, రియాద్లో వారి రాయబారి ద్వారా మేము మా తీవ్రమైన ఆందోళనను తెలియజేశాము. అత్యవసరంగా దిద్దుబాటు తీసుకోవాలని సౌదీని కోరాం'అని ఆయన తెలిపారు.
శ్రీవాస్తవ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్, లడఖ్ మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని తాము పునరుద్ఘాటించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
-
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు












Click it and Unblock the Notifications