భారతదేశంలో రుతుపవనాల వర్షాలు ఆందోళనకరమే!
న్యూఢిల్లీ: దేశంలో వేసవి కాలంలో ఎండలు తీవ్రంగానే ఉంటున్నాయి. అయితే, వచ్చే వర్షాకాలం మాత్రం వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం లేదని ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ సోమవారం వెల్లడించింది. దేశంలో రుతుపవన వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండనున్నాయని పేర్కొంది. ఎల్నితో తోపాటు రుతుపవనాలను ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉన్నాయని తెలిపింది.
'పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతదేశంలోని అగ్రి బౌల్, సీజన్ 2వ అర్ధభాగంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని స్కైమెట్ ట్వీట్ చేసింది. అయితే, తక్కువ వర్షపాతం నమోదుతో వ్యవసాయరంగానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

భౌగోళిక అవకాశాల పరంగా దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాలు వర్షాభావానికి గురయ్యే ప్రమాదం ఉందని స్కైమెట్ అంచనా వేసింది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో రుతుపవనాల నెలలలో జూలై, ఆగస్టులలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని మరో ట్వీట్లో పేర్కొంది.
జనవరి నెలలో కూడా స్కైమెట్ ఈ మేరకు వాతావరణ అంచనాలను విడుదల చేసింది.
స్కైమెట్ మేనేజింగ్ డైరెక్టర్ జతిన్ సింగ్ ప్రకారం.. ట్రిపుల్-డిప్-లా నినా సౌజన్యంతో.. నైరుతి రుతుపవనాలు గత 4 వరుస సీజన్లలో సాధారణ/సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఇప్పుడు, లా నినా ముగిసింది. కీలకమైన సముద్ర, వాతావరణ చరరాశులు ఈఎన్ఎష్ఓకి అనుగుణంగా తటస్థ పరిస్థితులు ఉన్నాయి. ఎల్ నినో సంభావ్యత పెరుగుతోంది. రుతుపవనాల సమయంలో దాని ప్రధాన వర్గంగా మారే సంభావ్యత ఎక్కువగా పెరుగుతోంది. ఎల్ నినో తిరిగి రావడం బలహీనమైన రుతుపవనాలను సూచించవచ్చు.












Click it and Unblock the Notifications