పాకిస్తాన్ రక్షణ మంత్రి పిచ్చి కూతలు
గత వారం కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత, రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున, పొరుగున ఉన్న భారతదేశం సైనిక దాడికి పాల్పడే అవకాశం ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ సోమవారం అన్నారు.
పాకిస్థాన్ ఆర్మీని తాము బలోపేతం చేశాము. ఈ పరిస్థితిలో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోబడ్డాయని ఆసిఫ్ ఇస్లామాబాద్లోని తన కార్యాలయంలో ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

భారతదేశపు నాయకుల నోటి దాడి పెరుగుతోందని, ఆ దేశం దాడి చేసే అవకాశం గురించి పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని ఆసిఫ్ అన్నారు. పాకిస్థాన్పై యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉందని, వారిని తిప్పి కొట్టడానికి తమ సైన్యం కూడా సంసిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.
కాశ్మీర్ దాడి తర్వాత, భారతదేశం ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పాకిస్తానీలుగా గుర్తించింది. ఈ విషయంలో పాకిస్థాన్ స్వాతంత్ర్య దర్యాప్తుగా సిద్ధమని ప్రకటించింది. యుద్ధానికి పాకిస్థాన్ సన్నద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మా ఉనికిని ప్రశ్నిస్తే ఎవర్నీ ఉపేక్షించేది లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ అత్యంత అప్రమత్తంగా ఉందని , అణ్వాయుధ ఆయుధాలను పరీక్షిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొన్నారు.












Click it and Unblock the Notifications