Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ 73వ గణతంత్ర వేడుకలు: దేశం..మువ్వన్నెల మయం

ఢిల్లీ: దేశం మరికొన్ని గంటల్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. ఇప్పటికే గణతంత్ర వేడుకలకు దేశం ముస్తాబవుతోంది. శరవేగంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలను దేశం జరుపుకుంటుంది. సాధారణంగా ఏటా జనవరి 24వ తేదీ నుంచే గణతంత్ర వేడుకలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనవరి 23వ తేదీ నుంచి దేశంలో గణతంత్ర వేడుకల శోభ కనిపిస్తోంది.

ఇక గణతంత్ర దినోత్సవంకు ఒక్క రోజు ముందు భారత రాష్ట్రపతి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జనవరి 26వ తేదీన దేశం 73వ గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో జనవరి 25వ తేదీన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రతి ఒక్కరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం మినిట్‌-టూ-మినిట్ అప్‌డేట్స్ లైవ్‌లో మీకోసం...

Indias 73rd Republic Day 2022 Live Updates And Highlights In Telugu

Jan 26, 2022, 12:18 pm IST

ప్రేక్షకులకు అభివాదం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
Jan 26, 2022, 12:16 pm IST

గణతంత్ర వేడుకల అనంతరం తిరిగి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. వీడ్కోలు పలికిన ప్రధాని మోదీ
Jan 26, 2022, 12:14 pm IST

ఢిల్లీలో ముగిసిన గణతంత్ర దినోత్సవ వేడుకలు
Jan 26, 2022, 12:07 pm IST

త్రిశూల్ ఫార్మేషన్: గంటకు 900 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన జెట్ విమానాలు
Jan 26, 2022, 12:02 pm IST

కేంద్ర పౌరవిమానాయానశాఖ నుంచి ఉడాన్ శకటం.ఉడాన్ స్కీమ్‌తో చాలా ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ లభించడంతో 80లక్షల మంది లబ్ధి పొందుతున్నారు
Jan 26, 2022, 11:38 am IST

15 రాష్ట్రాల నుంచి 485 మంది నృత్యకళాకారులచే నృత్య ప్రదర్శన
Jan 26, 2022, 11:38 am IST

రాజ్‌పథ్‌లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
Jan 26, 2022, 11:35 am IST

స్వాతంత్ర్య ఉద్యమంలో పంజాబ్ రాష్ట్రం సేవలను వివరిస్తున్న శకటం
Jan 26, 2022, 11:13 am IST

క్యామెల్ బ్యాండ్‌పై బీఎస్ఎఫ్ మార్చ్ పాస్ట్
Jan 26, 2022, 11:06 am IST

రాజ్‌పథ్‌లో ఇండియన్ నేవీ ప్రదర్శించిన శకటం
Jan 26, 2022, 11:01 am IST

సిక్కు ఇన్‌ఫాంట్రీ మార్చ్ పాస్ట్
Jan 26, 2022, 10:57 am IST

రాజ్‌పథ్‌ పై మార్చ్‌పాస్ట్‌ చేసిన జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ
Jan 26, 2022, 10:37 am IST

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వైన్ గ్లాస్ ఫార్మేషన్‌లో హెలికాఫ్టర్ విన్యాసాలు
Jan 26, 2022, 10:36 am IST

2020 శ్రీనగర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో అమరుడైన జమ్మూ కశ్మీర్ ఏఎస్ఐ బాబురాంకు అశోక్ చక్ర అవార్డును ఆయన భార్య కుమారుడికి అందజేస్తున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 26, 2022, 10:29 am IST

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 26, 2022, 10:25 am IST

రాష్ట్రపతి రాంనాథ్ ‌కోవింద్‌కు స్వాగతం పలికిన ప్రధాని నరేంద్రమోదీ
Jan 26, 2022, 10:22 am IST

రాజ్‌పథ్‌కు చేరుకున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 26, 2022, 10:22 am IST

ఢిల్లీ

రాజ్‌పథ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
Jan 26, 2022, 10:11 am IST

ఢిల్లీ

అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ
Jan 26, 2022, 10:04 am IST

అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారత 73వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మిఠాయిలు ఒకరికొకరు పంచుకున్న భారత్ పాక్ జవాన్లు
Jan 26, 2022, 10:00 am IST

మహారాష్ట్ర

ముంబైలోని శివాజీ పార్కులో జాతీయ జెండాను ఎగురవేసిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ
Jan 26, 2022, 9:59 am IST

ఢిల్లీ

తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Jan 26, 2022, 9:58 am IST

విద్యారంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. మనబడి, నాడు నేడు కింద కొత్త స్కూళ్లు కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Jan 26, 2022, 9:57 am IST

జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడులకు పంపే తల్లులకు రూ.15వేలు అందజేస్తున్నాం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Jan 26, 2022, 9:56 am IST

ఏపీ

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియా విద్యను ప్రవేశపెడుతున్నాం. తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా ఇది ఉంటుంది: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Jan 26, 2022, 9:55 am IST

ఏపీ

వైయస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 సాయం అందిస్తున్నాం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Jan 26, 2022, 9:54 am IST

ఏపీ

వ్యవసాయ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచాం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Jan 26, 2022, 9:53 am IST

ఏపీ

పేదవాడి సొంతింటి కలను నిజం చేశాం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Jan 26, 2022, 9:53 am IST

ఏపీ

రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Jan 26, 2022, 9:52 am IST

ఏపీ

ఏపీ ప్రభుత్వం 95 శాతం హామీలను నెరవేర్చింది: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+