coronavirus:దేశంలో తగ్గుతోన్న వైరస్, 48 గంటలతో పోలిస్తే బెటర్, పెరిగిన మృతుల సంఖ్య
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. గత రెండురోజుల్లో వైరస్ కేసులు 16 శాతం నమోదై.. 13 వేల 835 కొత్తగా రికార్డయ్యాయి. దీనిని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఇది గత రెండురోజుల్లో తక్కువ నమోదుశాతం అని పేర్కొన్నది. అంతకుముందు ఇది 28 శాతంతో 11 వేల 933 కేసులు నమోదయ్యాయని వివరించింది.
ఈ వారం (ఆదివారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు) పాజిటివ్ కేసులు 64 శాతం రికార్డయ్యాయని పేర్కొన్నది. ఇది గత ఐదురోజులతో పోల్చితే తక్కువ అని.. అంతకుముందు 74 శాతం కేసులు వెలుగుచూశాయని తెలిపింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పశ్చిమాసియా దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తక్కువగానే ఉన్నాయి.
దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య కొంచెం తగ్గుతోన్న.. తర్వాత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల్లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య డబుల్ చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు మృతుల సంఖ్య శుక్రవారం 452కి చేరగా.. ఆరురోజుల క్రితం అది 225కి అటు ఇటుగా ఉంది. అంటే వారం రోజుల్లో చనిపోయిన వారి సంఖ్య రెట్టింపు అవడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో వైరస్ సోకిన వారి సంఖ్య శుక్రవారానికి 2 వేల 711కి చేరింది. ఢిల్లీలో 1551తో రెండో స్థానంలో ఉంది. తరవాత 1816తో మధ్యప్రదేశ్, తమిళనాడు 1072 కేసులతో నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో రాజస్థాన్ 956 ఉంది.