ఏప్రిల్-ఆగస్టులో భారత ఎనిమిది ప్రధాన పరిశ్రమల్లో 8.5 శాతం క్షీణత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అనేక రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కరోనా లాక్డౌన్ కారణంగా గత కొద్ది నెలలుగా నిలిచిపోయిన పరిశ్రమల కార్యకలాపాలు ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. భారతదేశ మౌలిక సదుపాయాల ఎనిమిది ప్రధాన రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
మౌలిక సదుపాయాల ఎనిమిది ప్రధాన రంగాలు ఈ ఏడాది 8.5 శఆతం క్షీణత నమోదు చేసి ఆగస్టులో 117.6కు చేరింది. ఈ మేరకు కామర్స్ ఇండస్ట్రీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

స్టీల్, రిఫనరీ ఉత్పత్తులు, సిమెంట్ ఉత్పత్తి వరుసగా ఆరో నెల కూడా క్షీణతనే నమోదు చేయడం గమనార్హం. 2019 ఆగస్టులో ఎనిమిది కోర్ పరిశ్రమల సూచిక 0.2 శాతం తగ్గింది.
కోల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫనరీ ఉత్పత్తులు, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తులు ఈ ఎనిమిది రంగాల్లో ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపి) లో చేర్చబడిన వస్తువుల బరువులో ఇవి 40.27 శాతంగా ఉన్నాయి.
బొగ్గు, ఎరువులు మినహా మిగిలిన రంగాలు ఆగస్టు నెలలో ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.ఏప్రిల్-ఆగస్టు కాలంలో, ఎనిమిది కోర్ రంగాలు ఏడాది క్రితం కంటే 17.8 శాతం కుదించాయి. ఈ రంగాలు ఏడాది క్రితం ఇదే కాలంలో 2.5 శాతం పెరిగాయి.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications