ఐఎన్ఎస్ కల్వరి జలప్రవేశం, జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
Recommended Video

INS Kalvari : మేడిన్ ఇండియా తొలి సబ్ మెరైన్ జలప్రవేశం, వీడియో
ముంబై: మేడిన్ ఇండియా తొలి స్కార్పియన్ ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి గురువారం నౌకాదళంలో చేరింది. ఉదయం దీనిని నౌకాదళానికి అప్పగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు.
ఈ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ను ఫ్రాన్స్ నిర్మాణ సంస్థ సహకారంతో నిర్మించారు. 1.566 టన్నుల బరువైన ఈ సబ్ మెరైన్ టైగర్ షార్క్ తరహాలో హిందూ మహాసముద్రంలో డీప్ సీ ప్రిడేటర్గా పని చేయనుంది.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. భారత్ - ఫ్రాన్స్ మధ్య వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఐఎన్ఎస్ కల్వరి ఒక చక్కటి ఉదాహరణ అన్నారు.
సముద్రమార్గం ద్వారా ప్రవేశించే ఉగ్రవాదం, డ్రగ్స్ రవాణా, అక్రమ చేపల వేటను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో భారత్ మరింత కీలక పాత్ర పోషించనుందన్నారు.












Click it and Unblock the Notifications