అదిర్ చీకటి రోజులను మరిచారు .. ఎమర్జెన్సీపై ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ఎమర్జెన్సీ సమయం దేశంలో చీకటి రోజులని గుర్తుచేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేసిన తుగ్లక్ చర్య అత్యవసర పరిస్థితి అని విమర్శించారు మోడీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ .. విపక్షాలపై ఒంటికాలిపై లేచారు. ఎమర్జెన్సీ అంటే ఆత్మహత్యసదృశమని వివరించారు.
చీకటి రోజులే ..
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు మగ్గిపోయారు. ఈ సమయంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని .. వ్యవస్థలు స్తంభించిపోయాయని గుర్తుచేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 44 ఏళ్లు అయ్యింది. అయినా అప్పటి చేదు ఘటనలు కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పనులు చేపట్టిందని ఆ పార్టీ పక్స నేత అదిర్ రంజన్ చౌదరి నిన్న ప్రసంగించిన సంగతి తెలిసిందే.

దీనికి మోడీ ప్రతిస్పందించారు. సోమవారం రోజున చౌదరి తన ప్రసంగంలో ఎమర్జెన్సీ మరచిపోయారని గుర్తుచేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిందెవరు ? రాజ్యాంగాన్ని ఎవరు భ్రష్టు పట్టించారు ? మీడియాను, న్యాయ వ్యవస్థలను నియంత్రించింది ఎవరు ? ఆ చీకటి రోజులనే మేం ఎప్పటికీ మరచిపోమన్నారు ప్రధాని మోడీ.
సీటు కోసం ...
ఒకరు తమ పదవీని కాపాడుకునేందుకు దేశ ఆత్మను చూర్ణం చేశారు అప్పటి ప్రధాని ఇందిరా అని విమర్శించారు మోడీ. దీంతో మీడియా అరచి నిజాలు చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అలాగే నేతలను రహస్య ప్రదేశాలకు తరలించారని గుర్తుచేశారు. ఎమర్జెన్నీ రెండేళ్లలో జరిగిన అరాచకాలు, అన్యాయాలను ప్రజలకు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ఆనాటి చీకటి రోజులు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇంతటీ కీలకమైన అంశాన్ని మరచిపోయి .. మా హయాంలో అదీ చేశాం, ఇదీ చేశామని జబ్బలు చరుచుకుంటున్నారని దుయ్యబట్టారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications