అదిర్ చీకటి రోజులను మరిచారు .. ఎమర్జెన్సీపై ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ఎమర్జెన్సీ సమయం దేశంలో చీకటి రోజులని గుర్తుచేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేసిన తుగ్లక్ చర్య అత్యవసర పరిస్థితి అని విమర్శించారు మోడీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ .. విపక్షాలపై ఒంటికాలిపై లేచారు. ఎమర్జెన్సీ అంటే ఆత్మహత్యసదృశమని వివరించారు.
చీకటి రోజులే ..
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు మగ్గిపోయారు. ఈ సమయంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని .. వ్యవస్థలు స్తంభించిపోయాయని గుర్తుచేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 44 ఏళ్లు అయ్యింది. అయినా అప్పటి చేదు ఘటనలు కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పనులు చేపట్టిందని ఆ పార్టీ పక్స నేత అదిర్ రంజన్ చౌదరి నిన్న ప్రసంగించిన సంగతి తెలిసిందే.

దీనికి మోడీ ప్రతిస్పందించారు. సోమవారం రోజున చౌదరి తన ప్రసంగంలో ఎమర్జెన్సీ మరచిపోయారని గుర్తుచేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిందెవరు ? రాజ్యాంగాన్ని ఎవరు భ్రష్టు పట్టించారు ? మీడియాను, న్యాయ వ్యవస్థలను నియంత్రించింది ఎవరు ? ఆ చీకటి రోజులనే మేం ఎప్పటికీ మరచిపోమన్నారు ప్రధాని మోడీ.
సీటు కోసం ...
ఒకరు తమ పదవీని కాపాడుకునేందుకు దేశ ఆత్మను చూర్ణం చేశారు అప్పటి ప్రధాని ఇందిరా అని విమర్శించారు మోడీ. దీంతో మీడియా అరచి నిజాలు చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అలాగే నేతలను రహస్య ప్రదేశాలకు తరలించారని గుర్తుచేశారు. ఎమర్జెన్నీ రెండేళ్లలో జరిగిన అరాచకాలు, అన్యాయాలను ప్రజలకు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ఆనాటి చీకటి రోజులు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇంతటీ కీలకమైన అంశాన్ని మరచిపోయి .. మా హయాంలో అదీ చేశాం, ఇదీ చేశామని జబ్బలు చరుచుకుంటున్నారని దుయ్యబట్టారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications