ఇండియా గౌరవాన్ని దెబ్బతీశాడు : ట్రంప్తో సమావేశం కావొద్దు .. మోడీకి సీతారం ఏచూరి డిమాండ్
న్యూఢిల్లీ : జీ-20 సదస్సులో సమావేశమయ్యే ఒకరోజు ముందు వస్తువులపై పన్నుపై భారత్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించడం ఏంటని ప్రశ్నించింది సీపీఎం. ఓ దేశానికి భయాభాంతులకు గురిచేయడం సరికాదని హితవు పలికింది. భారత్ను అవమానానికి గురిచేసిన ట్రంప్తో ప్రధాని మోడీ చర్చలు జరపకూడదని డిమాండ్ చేసింది.
సరికాదు ..
అమెరికాకు చెందిన 29 వస్తువులపై భారత్ దిగుమతి సుంకం విధించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న ట్రంప్ భారత్ వైఖరిని తప్పపట్టారు. దీనిని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుపట్టారు. గతంలో భారతదేశాన్ని ఏ దేశం, ఏ నాయకుడు ఇలా అవమానపరచలేదని గుర్తుచేశారు. ట్రంప్ చేసిన ట్వీట్ దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. అంతేకాదు ఆయన బీజేపీ పార్టీని కూడా కించపరిచాడని పేర్కొన్నారు. ఓ దేశాధినేత బహిరంగంగా విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ ప్రధాని మోడీ చర్చలకు దూరంగా ఉండాలని కోరారు. ఇది ఓ వ్యక్తికి సంబంధించిన అంశం కాదు .. దేశ గౌరవానికి సంబంధించిన విషయమని నొక్కి వక్కానించారు. అంతేకాదు ప్రధాని పదవీకి ఉన్న గౌరవానికి సంబంధించిన విషయమని గుర్తుచేశారు. దీంతో అధికార బీజేపీ కఠిన వైఖరి అవలంభించాలని గుర్తుచేశారు.

ఇదీ విషయం
అమెరికా నుంచి భారత్ దిగుమతి అయ్యే 25 వస్తువులపై ఇండియా పన్ను పోటు పొడిచింది. దీంతో అమెరికా ఆదాయానికి భారీగా గండిపడనుంది. భారత్ ఎగుమతి చేసే వస్తువులకు అమెరికా కూడా పన్ను విధించింది. దీంతోపాటు ప్రాధాన్య వాణిజ్య హోదా నుంచి భారత్ను తొలగించిన నేపథ్యంలో భారత్ పన్ను విధిస్తున్నట్టు స్పష్టంచేసింది. స్టీల్, అల్యూమినియం అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తోంది. గతేడాది మార్చి నుంచి వీటిపై ట్యాక్స్ విధిస్తోంది అమెరికా. అయినప్పటికీ భారత్ ఊరుకుంది. జీఎస్పీ కార్యక్రమం నుంచి కూడా భారత్ను అమెరికా తొలగించింది. దీంతో ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై పన్ను విధిస్తామని స్పష్టంచేసింది. 25 ఉత్పత్తులపై ఈ నెల 16 నుంచి ట్యాక్స్ వసూల్ చేస్తుంది. ఆ ఉత్పత్తుల్లో బాదం, వాల్ నట్స్, కాయ తదితర వస్తువులు ఉన్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి నిన్న స్పందించారు. అమెరికా వస్తువులపై భారత్ పన్ను విధించడం సరికాదన్నారు. తాము విధిస్తున్న పన్ను వెనక్కి తీసుకోవాలని కోరారు. శుక్రవారం మోడీతో సమావేశం కానున్న నేపథ్యంలో ట్రంప్ కామెంట్స్ ప్రాధాన్యం కలిగించాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications