వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దులో తెగబడ్డ చైనా: పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని భారత్‌కు హెచ్చరిక!

భారత్-చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా 'డోకా లా' వివాదం రగులుతోంది. సిక్కీం సెక్టార్ లోని భూటాన్ భూభాగంలో చైనా నిర్మిస్తున్న రహదారి ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తమ భూభాగంలోకి తొలుత

|
Google Oneindia TeluguNews

సిక్కిం: భారత్-చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా 'డోకా లా' వివాదం రగులుతోంది. సిక్కీం సెక్టార్ లోని భూటాన్ భూభాగంలో చైనా నిర్మిస్తున్న రహదారి ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తమ భూభాగంలోకి తొలుత భారత జవాన్లే అక్రమంగా చొచ్చుకు వచ్చి రహదారి నిర్మాణాన్ని అడ్డుకున్నారని చైనా ఆరోపిస్తోంది.

మాదీ 1962 చైనా కాదు, అందుకే భారత్ ఇలా: రెచ్చగొట్టేలా డ్రాగన్ కంట్రీమాదీ 1962 చైనా కాదు, అందుకే భారత్ ఇలా: రెచ్చగొట్టేలా డ్రాగన్ కంట్రీ

మరోవైపు చైనా సైనికులే భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి.. రెండు బంకర్లను ధ్వంసం చేశారని భారత సైన్యం ఆరోపిస్తోంది. ఇందుకు బలం చేకూర్చేలా తాజాగా చైనా దురాక్రమణపై ఓ వీడియో వెలుగుచూసింది. చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులు.. భారత భూభాగంలోకి చొచ్చుకురావడాన్ని మన సైనికులు అడ్డుకుంటున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

1962 యుద్ధం గుర్తుందిగా: చైనా వివాదాస్పద వ్యాఖ్యలు.. తీవ్రంగా హెచ్చరించిన భారత్1962 యుద్ధం గుర్తుందిగా: చైనా వివాదాస్పద వ్యాఖ్యలు.. తీవ్రంగా హెచ్చరించిన భారత్

చైనా మీడియా దురుసుతనం:

చైనా మీడియా దురుసుతనం:

మొత్తం మీద సిక్కీం సరిహద్దు కేంద్రంగా చైనా-భారత సైన్యాలు ఢీ అంటే ఢీ అన్న తరహాలో వ్యవహరిస్తుండటం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇలాంటి తరుణంలో.. వివాదాన్ని మరింత రచ్చకీడ్చేలా.. చైనా మీడియా తన దురుసుతనం బయటపెట్టుకోవడం గమనార్హం.చైనా సైన్యం చర్యలను సమర్థించుకుంటూ.. తమ సైనిక శక్తి ముందు భారత్ బలాదూరే అన్నట్లుగా అక్కడి మీడియా వ్యాఖ్యానించింది.

పరిణామాలు తీవ్రంగా ఉంటాయని:

పరిణామాలు తీవ్రంగా ఉంటాయని:

భారత్ సైనిక ఘర్షణకు దిగితే.. 1962కన్నా ఎక్కువగా దెబ్బతింటుందని హెచ్చరించింది. ఇప్పటి ఇండియన్ ఆర్మీ.. ఒకప్పటి 1962యుద్దంలో దెబ్బతిన్న భారత సైన్యం లాంటి కాదని కేంద్రమంత్రి జైట్లీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చైనా మీడియా స్పందించింది. ఈ మాట అనేముందు.. ఇప్పటి చైనా కూడా ఒకప్పటి కంటే మరింత శక్తివంతంగా ఉందని హెచ్చరించింది.

గ్లోబల్ టైమ్స్ కథనం:

గ్లోబల్ టైమ్స్ కథనం:

భారత్ ను హెచ్చరిస్తూ.. చైనా ప్రభుత్వ మీడియా సంస్థ 'గ్లోబల్ టైమ్స్' ప్రచురించిన ఈ కథనంలో పరుషమైన పదజాలం వాడినట్లుగా తెలుస్తోంది. డోక్ లా ప్రాంతంలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుని దాన్నో వివాదంగా మార్చడానికి భారత్ యత్నిస్తోందని చైనా మీడియా ఆరోపించింది. భారత్ ను ప్రచ్చన్న యుద్ద పిపాసి అని పేర్కొంటూ.. రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రాంతంలో సిలిగురి కారిడార్ కు భూసంబంధాలు తెగిపోతున్నాయని భారత్ ఆందోళన చెందుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఇదీ భారత్ వ్యూహం అని!

ఇదీ భారత్ వ్యూహం అని!

ఈశాన్య ప్రాంతాల్లోని కల్లోలాన్ని కట్టడి చేసేందుకు సిలిగురి కారిడార్ వ్యూహాత్మకంగా కీలకమని భారతీయులు అనుకుంటుండమే భారత సైన్యాన్ని ఇలాంటి చర్యలకు ఉసిగొల్పుతోందని అభిప్రాయపడింది. కాగా, భారత సైనికులు తమ భూభాగంలోకి చొచ్చుకు వస్తున్నారన్న కారణంగా.. భారతీయులు చేపట్టే మానస సరోవర యాత్రను చైనా నిలిపివేయడం గమనార్హం. గత 20రోజులుగా భారత చైనా మధ్య నలుగుతున్న ఈ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు.

English summary
As the Sino-Indian border standoff+ enters the 20th day, an increasingly strident Chinese media said "shameless" India must be taught "a bitter lesson" and added that India "will suffer greater losses than in 1962" if war were to break out today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X