ఆపరేషన్ సింధూర్ 2.0-మ్యాప్ లో లేకుండా చేస్తాం..! ఆర్మీఛీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్..!
భారత్-పాక్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. తాజాగా సర్ క్రీక్ సరిహ్దదు ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలను పెంచడం, నిర్మాణాలు చేపడుతుండటంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఇప్పటికే రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. అయినా పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఇవాళ ఆర్మీ ఛీఫ్ ఉపేంద్ర ద్వివేదీ మరింత తీవ్ర హెచ్చరిక చేశారు.
ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపకపోతే మ్యాప్ లో నుంచి పాకిస్తాన్ ను తుడిచిపెడతామంటూ ఆర్మీఛీప్ ఉపేంద్ర ద్వివేదీ పొరుగుదేశాన్ని హెచ్చరించారు. పాకిస్తాన్ తన స్థానాన్ని నిలుపుకోవాలనుకుంటే ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాలని సూచించారు. రాజస్థాన్లోని అనుప్గఢ్లోని ఒక ఆర్మీ పోస్ట్లో జనరల్ ద్వివేది ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి భారత దళాలు ఎటువంటి సంయమనం పాటించవని, ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడాన్ని ఆపకపోతే ఆపరేషన్ సింధూర్ రెండో వెర్షన్ ఎంతో దూరంలో లేదని స్పష్టం చేశారు.

ఈసారి ఆపరేషన్ సిందూర్ 1.0లో చూపిన సంయమనాన్ని ఇకపై కొనసాగించబోమని పాకిస్తాన్ ను ఆర్మీ ఛీఫ్ హెచ్చరించారు. ఈసారి పాకిస్తాన్ భౌగోళికంగా తన స్థానాన్ని నిలుపుకోవాలనుకుంటుందా లేదా అని ఆలోచించేలా చేసే పని చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సైనికులు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. దేవుడు కోరుకుంటే, మీకు త్వరలో అవకాశం లభిస్తుందంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో అసాధారణంగా పనిచేసిన ముగ్గురు అధికారులను ఆర్మీ చీఫ్ ఇవాళ సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ 140వ బెటాలియన్ కమాండెంట్ ప్రభాకర్ సింగ్, రాజ్పుతానా రైఫిల్స్ మేజర్ రితేష్ కుమార్ , హవల్దార్ మోహిత్ గైరా ఈ గుర్తింపు అందుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమాయక ప్రాణాలకు హాని కలిగించకూడదని, సైనిక లక్ష్యాలను నాశనం చేయకూడదని భావించామని, ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు , వాటి సూత్రధారులను నిర్మూలించడంపై దృష్టి సారించామని ఆర్మీ చీఫ్ తెలిపారు. అప్పట్లో తమ విధ్వంసంపై ప్రపంచానికి ఆధారాలను ఇచ్చామన్నారు. తాము అలా చేయకపోతే పాకిస్తాన్ నిజాన్ని దాచిపెట్టి ఉండేదని ఆర్మీ ఛీఫ్ తెలిపారు.
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications