సరికొత్తగా: ఫ్లయింగ్ బర్డ్ కేజ్లో పెళ్లి వేదిక వద్దకు వధూవరులు (వీడియో)
ఢిల్లీ: ఓ జంట పెళ్లి మండపానికి పక్షిలా ఉండి ఎగిరే ఓ ఎలక్ట్రిక్ పంజరంలో (ఫ్లయింగ్ బర్డ్ కేజ్) వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల పెళ్లి చేసుకోవడం మొదలు.. పిల్లలకు పేర్లు పెట్టే వరకు.. అన్నింటా కొత్త ఆలోచనలు చేస్తున్నారు.
ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ జంట మరికొంత కొత్తగా ఆలోచించి ఎగురుకుంటూ వచ్చింది. సాధారణ పద్ధతిలో వివాహం చేసుకుంటున్నప్పటికీ.. కొత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు.
It’s a bird, it’s a plane, it’s the groom and bride.
— Pakchikpak Raja Babu (@HaramiParindey) July 13, 2018
Indian weddings are getting out of hand. pic.twitter.com/AEWlxw54xD
జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే పెళ్లి ఘట్టాన్ని విభిన్నంగా చూడాలని చాలామంది భావిస్తున్నారు. ఓ జంట పెళ్లి మండపంలోకి ఈ పంజరంలో వచ్చింది. భారీ ఎలక్ట్రిక్ పంజరం ఏర్పాటు చేసి అందులో వధూవరులు నిలబడేలా రూపొందించారు.
పెళ్లి వేడుక జరిగే చోటుకు ఆకాశం నుంచి ఆ పంజరాన్ని ఓ గద్ద తీసుకువస్తున్నట్లుగా క్రేన్ సాయంతో కిందకు దించారు. ఆ పంజరం కిందకు దిగుతున్నప్పుడు వెలుగులు జిమ్ముతున్న దృశ్యాన్ని అక్కడున్న అతిథులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.