దేశీ ఐటీపై భరోసా కష్టమే?, కళ చెదిరింది: విదేశీ మీడియా ఆసక్తికరం..
2020నాటికి ఇండియాలో ఏటా 2లక్షల ఉద్యోగాల కోత ఉంటుందని హెడ్ హంటర్స్ ఇండియా పేర్కొనడం దేశీ ఐటీ ఎంతటి ఒడిదుడుకుల్లో ఉందో స్పష్టం చేస్తోంది.
న్యూఢిల్లీ: భారతీయ ఐటీ గత కొన్నాళ్లుగా ఒడిదుడుకులను చవిచూస్తూనే ఉంది. ఆటోమేషన్ ప్రభావంతో చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉద్యోగాలు కూడా కోల్పోయిన పరిస్థితి. హెచ్1బి వీసాల నిబంధనలతో దేశీ ఐటీ ఉద్యోగులను విదేశాలకు పంపించడం మరింత కష్టంగా మారింది.
తాజాగా ఇదే విషయాన్ని విదేశీ మీడియా కూడా ప్రస్తావించింది. దేశీ ఐటీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించింది. ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ పదవులకు విశాల్ సిక్కా రాజీనామా నేపథ్యంలో భారతీయ ఐటీ రంగం ఎగుమతులు గత ఏడేళ్లలో కనిష్ట స్థాయికి పేర్కొంది. దీని ప్రభావంతో కరెంట్ ఖాతా లోటు పెరగడమే కాకుండా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, పాలకులకు ఇది ప్రతికూల అంశమని చెప్పుకొచ్చింది.

2014లో కోటి ఉద్యోగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వానికి ఈ ఇబ్బందులు తప్పవని తెలిపింది. హెచ్1బి వీసా నిబంధనలు భారత ఇంజనీర్లు అమెరికాలో అడుగుపెట్టేందుకు అవరోధంగా ఉన్నాయని చెప్పింది.అటు ఆటోమేషన్ దెబ్బకు 69శాతం ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయని వరల్డ్ బ్యాంక్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
దానికి తోడు 2020నాటికి ఇండియాలో ఏటా 2లక్షల ఉద్యోగాల కోత ఉంటుందని హెడ్ హంటర్స్ ఇండియా పేర్కొనడం దేశీ ఐటీ ఎంతటి ఒడిదుడుకుల్లో ఉందో స్పష్టం చేస్తోంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications