Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pahalgam:ఏప్రిల్ 16న జరిగిన పెళ్లి..ఉగ్రదాడిలో మృతి చెందిన నేవీ ఆఫీసర్..!!

Pahalgam Terror Attack: కళ్లు చెదిరే అందాలతో స్వర్గాన్ని తలపించే కశ్మీర్ లోయ ఒక్కసారిగా రక్తసిక్తమైంది! పర్యాటకులతో కళకళలాడుతున్న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతం మంగళవారం నాడు ఉగ్రవాదుల అమానుష దాడితో చిగురుటాకులా వణికిపోయింది. పిరికిపందల కాల్పుల్లో అమాయక పర్యాటకులు, స్థానికులు కలిపి ఏకంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో భారతీయ నేవీ అధికారి ఒకరు ఉండటం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

పెళ్లైన వారానికే విషాదం!
ఈ మారణకాండలో బలైపోయిన నేవీ అధికారిని లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26)గా గుర్తించారు. హర్యానాకు చెందిన వినయ్, కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న ఆయన, హనీమూన్ కోసమో, లేదా సెలవును ఎంజాయ్ చేసేందుకో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే, ఆనందంగా గడపాల్సిన సెలవు ఆయన జీవితంలో చివరిది కావడంతో కుటుంబంలోనే కాదు, దేశవ్యాప్తంగా విషాదం అలుముకుంది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు ధృవీకరించారు.

indian-navy-officer-vinay-narwal-recently-married-falls-to-terror-attack-in-kashmir

స్వర్గంలో నరకం: బైసరాన్ మైదానంలో దారుణం
పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే బైసరాన్ మైదానం, చుట్టూ దట్టమైన పైన్ అడవులు, పర్వతాలతో అత్యంత సుందరంగా ఉంటుంది. దేశం నలుమూలల నుంచే కాక, విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో, పర్యాటకులు తమ ఆనంద క్షణాలను గడుపుతున్న వేళ, ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కనీసం కనికరం చూపకుండా, తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ మారణహోమంలో మరణించిన 26 మందిలో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు స్థానికులు ఉన్నారు. 2019 పుల్వామా దాడి తర్వాత కశ్మీర్ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదే కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు, పర్యాటక సీజన్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఈ దాడి జరగడం వెనుక ఏదో కుట్ర దాగివుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Take a Poll

కన్నీటి గాథలు: కర్ణాటక నుంచి వచ్చిన వారికి విషాదాంతం
ఈ దాడిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు కూడా మరణించారు. శివమొగ్గ జిల్లా విజయనగరానికి చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ రావు (47) తన భార్య పల్లవి, కుమారుడు అభిజయ్‌తో కలిసి పహల్గామ్ వచ్చారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మంజునాథ్ రావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. "మా కళ్లముందే ఉగ్రవాదులు మా ఆయనను కాల్చిచంపారు" అని మంజునాథ్ రావు భార్య పల్లవి స్థానిక ఛానెళ్లకు ఫోన్‌లో చెప్పిన మాటలు హృదయాలను ద్రవింపజేశాయి.

మరో దారుణంలో బెంగళూరుకు చెందిన భరత్ భూషణ్ మరణించారు. ఆయనతో పాటు ఉన్న భార్య సుజాత, మూడేళ్ల కుమారుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, తాను సుజాతతో మాట్లాడానని, ఆమె భర్త భరత్ భూషణ్ దాడిలో మరణించారని, అయితే ఆమె, వారి చిన్న కుమారుడు సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

గాలింపు చర్యలు ముమ్మరం: నిందితుల కోసం వేట
ఈ కిరాతక దాడి అనంతరం,భారత సైన్యంతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బైసరాన్, పహల్గామ్, అనంతనాగ్ పరిసర ప్రాంతాల్లో సంయుక్తంగా భారీ గాలింపు ఆపరేషన్‌ను ప్రారంభించారు. దాడికి పాల్పడిన వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదని,వారిని పట్టుకొని న్యాయస్థానం ముందు నిలబెట్టడమే లక్ష్యమని చినార్ కార్ప్స్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.

అందమైన కశ్మీర్ లోయలో అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారితీసింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని దేశం మొత్తం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. ఈ దాడితో పర్యాటక రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+