మేం దోచుకోం, ఉద్యోగాలు కల్పిస్తాం: యూఎస్ కు భారత్ రిప్లై
అమెరికా ఉద్యోగాలను తాము కొల్లగొట్టబోమని, కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
ముంబై: అమెరికాలో హెచ్ 1 బీ వీసాలపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం అమెరికాతో చర్చించిందని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.అమెరికన్ల ఉద్యోగాలను తాము కొల్లగొట్టబోమని ఆయన ప్రకటించారు.అమెరికన్లకు ఉద్యోగాలను తాము సృస్టిస్తామని ఆయన స్పష్టం చేశారు.
హెచ్ 1 బీ వీసాలపై ఆందోళనల విషయమై కేంద్ర ఐటి శాఖ మంత్రి శుక్రవారం నాడు ముంబైలో జరిగిన కార్యక్రమంలో స్పందించారు.ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టు ఆయన చెప్పారు.

హెచ్ 1 బీ వీసాల విషయంలో భారత్ లో నెలకొన్న ఆందోళనల విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్ళినట్టు ఆయన చెప్పారు. భారతీయులు ఉద్యోగాలను లాగేసుకోరని, కొత్త ఉద్యోగాలను సృస్టిస్తారని ఆయన చెప్పారు. వీసాల అంశంపై అమెరికా ఉన్నతాధికారులతో చర్చించినట్టుగా ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు.
తాము చెప్పిన అంశాలను అమెరికా ఉన్నతాధికారులు అర్థం చేసుకొంటారని ఆయన అభిప్రాయపడ్డారు.భారత ఐటి కంపెనీలు అమెరికాతో కలిపి 80 దేశాల్లోని 200 నగరాల్లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కేవలం ఒక్క అమెరికాలోనే భారత ఐటి కంపెనీలు ఐదేళ్ళలో 20 బిలియన్ డాలర్లు పన్నుల రూపంలో చెల్లించాయన్నారు.అంతేకాదు 4 లక్షల మందికి ఉద్యోగాలను ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
భారత ఐటి కంపెనీలు అమెరికాకు పెద్ద ఆస్తి అని ఆయన ెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పోటీతత్వానికి భారతీయ టెక్నికల్ ఫ్రోఫెషనల్స్ ఎంతగానో సహకరిస్తున్నారని ఆయన అమెరికా యంత్రాంగానికి తెలిపినట్టు రవిశంకర్ చెప్పారు.భారత్ ను డిజిటల్ గా అభివృద్ది చేసేందుకుగాను డిజిటల్ ఇండియా స్టార్టప్ ఇండియా బాగా సహకరిస్తున్నాయని చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications