Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికాకు భారత్ చెప్పిన సత్యం!.. డొనాల్డ్ ట్రంప్‌కు తెలియని చరిత్ర!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు గానూ ఇండియాపై 50 శాతం సుంకం విధించారు. అయితే అమెరికా భారత్‌పై ఒత్తిడి తేవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేకసార్లు అమెరికా ఇలాగే ప్రయత్నించింది, కానీ ప్రతిసారి భారత్ గట్టిగా నిలబడింది. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయీ వంటి ప్రధానులు తమ పాలనలో అమెరికాకు గుణపాఠం నేర్పారు. వారు ఎలా గుణపాఠాలు నేర్పారో తెలుసుకుందాం.

1. 1965లో ఆహార సంక్షోభం సమయంలో..

సమయం: 1965లో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు.

ఒత్తిడి: అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పాలనలో భారత్ తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంది. అమెరికా అప్పటికి ఒక పథకం కింద ఇండియాకు గోధుమలను పంపేది. అయితే, అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్, యుద్ధాన్ని ఆపమని ఇండియాను ఒత్తిడి తెచ్చారు. లేకపోతే గోధుమల సరఫరాను ఆపివేస్తామని హెచ్చరించారు.

భారత్ స్పందన: లాల్ బహదూర్ శాస్త్రి ఆ బెదిరింపులకు లొంగలేదు. "మీరు గోధుమల సరఫరాను ఆపండి, కానీ మేము మా ఆత్మగౌరవాన్ని వదులుకోం" అని గట్టిగా చెప్పేశారు. ఈ సందర్భంలోనే ఆయన 'జై జవాన్ జై కిసాన్' అనే నినాదాన్ని ఇచ్చారు. దేశ ప్రజలందరినీ ఒక పూట ఉపవాసం ఉండాలని కోరారు.

India s Bold Response to US Pressure From 1965 to 1998 How India Stood Tall Against America

2. 1971 భారత్-పాక్ యుద్ధం
సమయం: 1971లో భారత్-పాక్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు.

ఒత్తిడి: అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పాలనలో అమెరికా పూర్తిగా పాకిస్తాన్‌కు మద్దతునిచ్చింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, యుద్ధాన్ని ఆపమని ఇండియాపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి పెంచడానికి తన నావికా దళాన్ని కూడా ఇండియా వైపు పంపారు.

భారత్ స్పందన: ఇందిరా గాంధీ ఆ ఒత్తిడికి లొంగలేదు. ఎందుకంటే అప్పటికి భారతదేశానికి రష్యా మద్దతు ఉంది. ఇండియా ఈ యుద్ధంలో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి, బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసింది.

3. 1974లో పోఖ్రాన్-1 అణు పరీక్ష
సమయం: 1974లో భారతదేశం తన మొదటి అణు పరీక్ష (పోఖ్రాన్-1) నిర్వహించినప్పుడు.

ఒత్తిడి: ఈ అణు పరీక్షను ఆపడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్, ఇందిరా గాంధీని ఉద్దేశించి అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించారు. అణు ఇంధనం, సాంకేతికత, ఆర్థిక సహాయంపై ఆంక్షలు విధించారు.

భారత్ స్పందన: ఇందిరా గాంధీ లొంగలేదు. ఆమె స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు. కొత్త అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు.

4. 1998లో పోఖ్రాన్-2 అణు పరీక్ష
సమయం: 1998లో భారతదేశం రెండో అణు పరీక్ష (పోఖ్రాన్-2) నిర్వహించినప్పుడు.

ఒత్తిడి: అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. ఆంక్షలు విధించింది. ఇందులో ఆయుధాల అమ్మకాలపై నిషేధం, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుంచి ఆర్థిక సహాయం నిలిపివేయడం వంటివి ఉన్నాయి.

భారత్ స్పందన: వాజ్‌పేయీ ప్రభుత్వం ఆంక్షలకు భయపడలేదు. చైనా, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలు అణు సామర్థ్యం కలిగి ఉన్నందున, దేశ భద్రతకు ఈ పరీక్షలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. కొన్ని నెలల తర్వాత, ఇండియాను ఒంటరిగా ఉంచడం సాధ్యం కాదని గ్రహించిన అమెరికా, 1999 నాటికి ఆంక్షలను తొలగించింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనకు రావడంతో సంబంధాలు మెరుగుపడ్డాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+