ఆన్ లైన్ గేమింగ్ కత్తికి రెండు వైపులా పదును?
రియల్ మనీ/ఆన్ లైన్ గేమింగ్ వల్ల ప్రతి సంవత్సరం సుమారు 45 కోట్ల మంది జేబులకు చిల్లుపడుతోంది. దాదాపు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల మేర సొమ్మును కోల్పోతున్నారు. సమాజానికి ఇదొక ప్రధాన సమస్యగా మారడం వల్లే కేంద్ర ప్రభుత్వం వీటిని నిషేధించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ నిషేధం వల్ల అటు ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఆదాయపరంగా నష్టపోయినప్పటికీ ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ గేమింగ్ నిషేధం బిల్లును ఆమోదించంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

ప్రతి సంవత్సరం 45 కోట్ల మంది.. తమ కష్టార్జితాన్ని ఆన్ లైన్ గేమింగ్ వల్ల నష్టపోతున్నారని తెలిపింది. దీనివల్ల సంభవించే మొత్తం నష్టం సుమారు రూ. 20,000 కోట్లుగా అంచనా వేసింది. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు- 2025ను లోక్సభలో ప్రవేశపెట్టింది. దీన్ని ఆమోదింపజేసుకుంది.
ఈ బిల్లు ప్రకారం- మనీ గేమింగ్లో పాలుపంచుకున్న సంస్థలపై ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలను అందించే ఏ వ్యక్తికైనా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇచ్చే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది.
ఈ నిషేధం వల్ల పన్ను ఆదాయాలు తగ్గొచ్చని వెల్లడించాయి. అదే సమయంలో వినియోగదారుల భద్రత, జాతీయ డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవచ్చని, అక్రమ విదేశీ బెట్టింగ్ వెబ్సైట్లు, మట్కా ఆపరేటర్లను పూర్తిస్థాయిలో నియంత్రించినట్టవుతుందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.
క్యాసినో ఆపరేటర్ల నుండి జీఎస్టీ రూపంలో నాలుగు బిలియన్ డాలర్లకు పైగా అందే పన్నులు పూర్తిగా తగ్గిపోతాయని గేమింగ్ ఇండస్ట్రీ అంచనా వేసింది. ఇది దేశ రియల్-మనీ/ఆన్ లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ద్వారా అందే 3.5 బిలియన్ డాలర్ల ఆదాయం కంటే చాలా ఎక్కువ.
ఈ రంగం నుంచి సంవత్సరానికి రూ. 25,000 కోట్లకు పైగా ఆదాయం పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందుతోంది. డ్రీమ్ 11, గేమ్స్ 24x7, నజారా టెక్నాలజీస్ (పోకర్బాజి), గేమ్స్ క్రాఫ్ట్, మొబైల్ ప్రీమియర్ లీగ్ ఈ రంగంలో ఈ రంగంలో టాప్ ప్లేయర్లుగా ఉంటోన్నాయి.
తాజా నిషేధం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ స్కిల్-గేమింగ్ ఇండస్ట్రీకి చెందిన ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ఇ-గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు మనీకంట్రోల్ తెలిపింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications