ఒకే రన్వేపై దూసుకొచ్చిన రెండు విమానాలు: ఏం జరిగింది?
గోవా ఘటన తర్వాత దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మరో పెను ప్రమాదం తప్పింది.
న్యూఢిల్లీ: గోవా ఘటన తర్వాత దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మరో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. పొగ మంచు విపరీతంగా ఉండటంతో ఇండిగో, స్పైస్జెట్కు చెందిన రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనే పరిస్థితి ఏర్పడింది.
176 మంది ప్రయాణికులతో లక్నో నుంచి వస్తున్న ఇండిగో విమానంలోని పైలట్.. సడెన్గా అదే రన్వేపై ఎదురుగా స్పైస్జెట్ విమానం కనిపించడంతో బ్రేకులు వేశాడు. కొన్ని మీటర్ల దూరంలోనే ఇండిగో విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సమయంలో ఇండిగో ఫ్లైట్ 6ఈ 769.. లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయని ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. స్పైస్జెట్ విమాన వివరాలు మాత్రం తెలియలేదు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications