బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేడీ టెక్కీ హత్య, ఇన్ఫోసిస్ కారణం, సీనియర్ల వేధింపులు, తండ్రి రాజు

|
Google Oneindia TeluguNews

పూణే: ఇన్ఫోసిస్ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు రసిలా రాజు (24)హత్యకు ఆ సంస్థ పూర్తి బాధ్యత వహించాలని ఆమె త్రండి రాజు (55) డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా దర్యాప్తు చేస్తే రసిలా హత్యకు కచ్చితమైన కారణాలు వెలుగు చూస్తాయని అన్నారు.

రసిలా హత్యకు పూర్తి బాధ్యత ఇన్ఫోసిస్ సంస్థదే అని ఆమె తండ్రి రాజు చెప్పారు. పోలీసులు చెబుతున్నట్లు రసిలా హత్యకు సెక్యూరిటీగార్డు కారణం కాదని ఆయన అంటున్నారు. రసిలాను ఆమె సీనియర్లు వేధింపులకు గురి చేశారని రాజు ఆరోపిస్తున్నారు.

<strong>షాక్: ఇన్ఫోసిస్ కార్యాలయంలో లేడీ టెక్కీ దారుణ హత్య</strong>షాక్: ఇన్ఫోసిస్ కార్యాలయంలో లేడీ టెక్కీ దారుణ హత్య

పూణేలో ఆయన పూణే మిర్రర్ ఆంగ్ల దినప్రతికతో మాట్లాడుతూ తన కుమార్తె చాల రోజు నుంచి బెంగళూరు బదిలి చెయ్యాలని ఇన్ఫోసిస్ కంపెనీలోని ఆమె సీనియర్లకు మనవి చేశారని గుర్తు చేశారు. అయితే నాలుగు రోజుల క్రితం తన బదిలి నిలిచిపోయిందని రసిలా తనకు ఫోన్ లో చెప్పిందని రాజు విలపించారు.

Infosys need to take responsibility for my daughter’s murder, Raju

ఇన్ఫోసిస్ సంస్థలో తన కుమార్తెకు ఉద్యోగం వచ్చిందని సంతోషంగా ఉన్నానని, అయితే ఇప్పుడు ఆ సంస్థ ఆమె జీవితం అంతం కావడానికి కారణం అయ్యిందని ఊహించుకోలేకపోతున్నానని రాజు విలపించారు.

<strong>లేడీ టెక్కీ హత్య: ఇన్ఫోసిస్ ఏం చెప్పిందంటే !</strong>లేడీ టెక్కీ హత్య: ఇన్ఫోసిస్ ఏం చెప్పిందంటే !

సెక్యూరిటీగార్డు వేధించి రసిలాను హత్య చేశారని చెబుతున్నారని, అయితే తన కుమార్తె హత్యకు ఇన్ఫోసిస్ సంస్థ కారణం అని తాను భావిస్తున్నానని రాజు అన్నారు. రసిలా ఇప్పటికే తల్లిని పోగోట్టుకుందని, తన కుమారుడు అబుధాబిలో ఉన్నాడని, ఇప్పుడు కుమార్తె మరణించడంతో తాను ఒంటరివాడైయ్యానని రాజు విలపించారు.

ఒక సెక్యూరిటీ గార్డు ఎలా రసిలా పని చేస్తున్న చోటకు వెలుతాడని, అక్కడి ఉద్యోగుల సహకరించకపోతే అది ఎలా సాధ్యం అవుతుందని రాజు ప్రశ్నించారు. మాజీ సైనికుడు అయిన నేను ప్రస్తుతం కేరళలో హోం గార్డుగా పని చేస్తున్నానని రాజు చెప్పారు.

<strong>ఇన్ఫోసిస్‌లో లేడీ టెక్కీ హత్య - బతిమాలిన గార్డ్..: అసలేం జరిగింది?</strong>ఇన్ఫోసిస్‌లో లేడీ టెక్కీ హత్య - బతిమాలిన గార్డ్..: అసలేం జరిగింది?

తాన కుమార్తె రసిలా హత్య కేసులో చివరి వరకు ఇన్ఫోసిస్ సంస్థ మీద న్యాయ పోరాటం చేస్తానని రాజు స్పష్టం చేశారు. వైద్య చికిత్స చేయించుకోవడానికి బెంగళూరు బదిలి చెయ్యాలని మెడికల్ సర్టిఫిక్ పెట్టుకున్నా రసిలా విషయంలో సీనియర్లు కనికరించలేదని రాజు ఆరోపించారు. రసిలా మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

English summary
Raju also questioned how a security guard could have access to the section where IT professionals work. Were other people involved? I cannot help thinking that way. But I am going to fight a legal battle against the company to bring justice to my daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X